BREAKING: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

తెలంగాణలోని హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లో మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

New Update
BREAKING NEWS

BREAKING NEWS

తెలంగాణలోని హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. డీసీఎం వ్యాన్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లో మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Pakistan: పాకిస్తాన్ లో రాహుల్ గాంధీ ట్రెండింగ్..వాడేసుకుంటున్న మీడియా..

ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వీరంతా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చెన్వెళ్లి గ్రామానికి చెందిన వారని పోలీసులు గుర్తించారు.

ఇది కూడా చూడండి: విజయనగరంలో టెర్రరిస్టుల కలకలం.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు

విందుకు వెళ్లి తిరిగి వస్తుండగా..

పరిగిలో జరిగిన ఓ విందుకు పలువురు టూరిస్టు బస్సులో వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బీజాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీ ఆగి ఉండగా.. దాన్ని బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు చికిత్స తీసుకుంటుండగా మృతి చెందారు. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం హైదరాబాద్‌‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చూడండి: Tapan Deka:  ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ పదవీ కాలం పొడిగింపు...మరో ఏడాది వరకు

 

ఇది కూడా చూడండి: Elon Musk: ట్రంప్‌కి బిగ్ షాకిచ్చిన ఎలాన్ మస్క్.. ‘అందులో ఖర్చు తగ్గిస్తాను’

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు