/rtv/media/media_files/2025/05/01/iuas4INqtYi3tjnDDQsN.jpg)
Gujarat Lady teacher illict relation with sudent
Viral Crime: గుజరాత్లో దారుణం జరిగింది. పిల్లలకు విద్యా బుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్ ఉపాధ్యాయ వృత్తినే అవమానించేలా ప్రవర్తించింది. ట్యూషన్కు వచ్చే అబ్బాయితో లేచిపోయింది. ఏకంగా నాలుగు రాష్ట్రాలు దాటి ప్రయాణించింది. చివరకు బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో గాలింపు చేపట్టిన పోలీసులు రాజస్థాన్ సరిహద్దులో ఓ ప్రైవేట్ బస్సులో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పొద్దంతా స్కూల్లో రాత్రి ఇంట్లో..
ఈ మేరకు సూరత్ నగరానికి చెందిన లేడీ టీచర్ (23) పొద్దంతా స్కూల్లో రాత్రి ఇంట్లో ట్యూషన్స్ చెబుతోంది. అయితే తన దగ్గరకు కొంతకాలంగా ట్యూషన్ వచ్చే 6వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల విద్యార్థితో చనవుగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య బంధం బలపడటంతో అతన్ని వెంటపెట్టుకుని లేచిపోయింది. దీంతో బాలుడి పేరెంట్స్ తన కొడుకును కిడ్నాప్ చేసిందంటూ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆమె గుజరాత్ నుంచి వివిధ ప్రాంతాలు తిప్పుతూ నాలుగు రాష్ట్రాలు దాటినట్లు సీసీపుటేజీ ఆధారంగా గుర్తించారు.
Also Read: వేసవిలో గుండె జబ్బులు ఉన్నవారు ఇవి గుర్తుంచుకోవాలి
బుధవారం తెల్లవారుజామున రాజస్థాన్ సరిహద్దులో ఓ ప్రైవేట్ బస్సులో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ సూరత్కు తరలించినట్లు తెలిపారు. ఇక విచారణలో వారిద్దరు తమ ఇళ్లలో గొడవల కారణంగా వెళ్లిపోయినట్లు అంగీకరించారని పోలీసులు చెప్పారు. ఇరువురి కుటుంబాలకు పరిచయాలున్నాయని చెప్పిన డీసీపీ భగీరథ్ గఢవీ.. ఆ బాలుడి వయసు 11ఏళ్ల కంటే ఎక్కువే ఉంటుందని చెబుతున్నారు. వీరిది లైంగిక సంబంధమా లేక, కిడ్నాప్ చేయాలనుకుందా అనేది దర్యాప్తులో తేలుస్తామన్నారు.
Also Read: ఆ వ్యాధులు ఉన్న వారు చెరుకు రసం అస్సలు తాగొద్దు.. షాకింగ్ విషయాలు!
gujarath | teacher | student | today telugu today telugu news