/rtv/media/media_files/2025/11/18/hidma-2025-11-18-13-41-52.jpg)
Hidma
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా(Mahesh Chandra Ladda) ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. మావోయిస్టుల అగ్ర నేతల్లో ఒకరైన హిడ్మా(hidma naxal leader) మృతి చెందినట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల కారణంగా అక్కడి నుంచి మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించి తమ కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించాలని చూస్తున్నట్లు ఇంటెలిజెన్స్ చీఫ్ తెలిపారు. మావోయిస్టుల కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచామన్నారు. రెండు రోజుల క్రితమే మావోయిస్టు నేతలు ఏపీలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారని పక్కా సమాచారం రావడంతో కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరగ్గా.. హిడ్మాతో పాటు అతని భార్య, మరో నలుగురు మృతి చెందినట్లు మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు.
ఇది కూడా చూడండి: Madvi Hidma : ఎన్కౌంటర్లో హిడ్మా హతం.. ఎందుకు పోలీసులకు మోస్ట్ వాంటెడ్ ?
Mahesh Chandra Ladda's Official Statement On Hidma's Death
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అధికారుల ఒత్తిడి తట్టుకోలేక మావోయిస్టులు ఏపీకి వస్తున్నారని మాకు సమాచారం అందింది
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2025
ఈ నేపధ్యంలో ఈరోజు ఉదయం మావోయిస్టు కదలికలు ఉన్నాయని పక్కా సమాచారంతో తనిఖీలు చేయగా, ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి
ఈ కాల్పుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్ హిడ్మాతో పాటు… https://t.co/1y1j0IE8SSpic.twitter.com/LYE2BOrcBM
ఇది కూడా చూడండి: Vijayawada : విజయవాడలో మావోయిస్టుల కలకలం!
Follow Us