అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టి ఒకే కుటుంబంలోని ముగ్గురు మరణించారు. పెదబయలు మండలంలోని ఓ కుటుంబంలో ఉన్న తల్లి, కూతరు, కొడుకు కూడా విద్యుత్ షాక్తో చనిపోయారు. తల్లి కోర్ర లక్ష్మి బట్టలు ఆరేయమని కుమారుడికి చెప్పింది. 13 ఏళ్ల కొడుకు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. ఇది కూడా చూడండి: SM Krishna: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత కొడుకును తల్లి రక్షిస్తుండగా.. దీంతో కొడుకును రక్షించడానికి ప్రయత్నిస్తుండగా తల్లికి(36), కూతురికి(10) కూడా కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే మృతి చెందారు. ఈమెకు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ఒకేసారి చనిపోవడంతో కుటుంబం బోరున విలపిస్తుంది. ఆ ఇద్దరు చిన్నారులను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక! ఇదిలా ఉండగా ఇటీవల యాదాద్రిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. బస్సు నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా.. బస్సులోని 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది కూడా చూడండి: బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరంతా తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి బాగానే ఉంది. ఈ ఘోర ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. విషయం తెలుసుకుని పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై విచారణ చేపట్టనున్నారు. ఇది కూడా చూడండి: Road Accident: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం