Pune bus rape case: బస్సులో రేప్ చేసిన.. మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ అరెస్ట్

పూణేలో సంచలనం సృష్టించిన రేప్ కేసులో మోస్ట్ వాంటెండ్ క్రిమినల్‌ దత్తాత్రేయ రాందాస్ గడేను పట్టుకున్నారు. క్రై బ్రాంచ్ పోలీసులు 75 గంటల పాటు గాలించి పూణే జిల్లాలోని శిరూర్ తహసీల్‌లోని ఓ గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు.

New Update
Pune bus rape case

Pune bus rape case Photograph: (Pune bus rape case)

బస్ స్టేషన్‌లో మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పూణే పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అతన్ని పట్టిస్తే లక్ష రూపాయల రివార్డ్ కూడా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అతడి కోసం మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలలో 13 టీమ్‌లుగా పోలీసులు గాలించారు. పూణే పోలీసులు శిరూర్ తహసీల్‌లో విస్తృతంగా సోదాలు చేశారు. స్నిఫర్ డాగ్‌లు, డ్రోన్‌లను కూడా రంగంలోకి దించారు. చెరకు తోటలు, అతని సన్నిహితుల ఇళ్లను చెక్ చేశారు. 

స్వర్గేట్ బస్ స్టేషన్‌లో మంగళవారం తెల్లవారుజామున ఆగిఉన్న ఆర్టీసీ బస్సులో దత్తాత్రేయ రాందాస్ గడేను 26 ఏళ్ల మహిళని అత్యాచారం చేశాడు. పూణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతన్ని 75 గంటల్లో అరెస్ట్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి పూణే జిల్లాలోని శిరూర్ తహసీల్‌లోని ఒక గ్రామంలో నిందితుడిని అరెస్టు చేసినట్లు పూణే పోలీసులు తెలిపారు. 

Also Read: వాహనాలకు ప్రభుత్వం కొత్త రూల్స్.. ఇది లేకుంటే కేసు ఫైల్, బండి సీజ్!

పూణే, అహల్యానగర్ జిల్లాల్లో రాందాస్ గడేపై ఆరు దొంగతనం, దోపిడీ కేసులున్నాయి. ఈ కేసుల్లో ఒక దాంట్లో అతడు అరెస్ట్ అయి 2019లో బెయిల్‌పై బయటకు వచ్చాడని పోలీసులు తెలిపారు. 

Also Read: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!

Advertisment
Advertisment
తాజా కథనాలు