/rtv/media/media_files/2025/06/23/up-love-2025-06-23-18-12-57.jpg)
యూపీలోని కన్నౌజ్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రియురాలిని తుపాకీతో చంపిన ఓ ప్రియుడు ఆతరువాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సౌరిఖ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని కుత్లా గ్రామానికి చెందిన మహిపాల్ సింగ్ యాదవ్ అలియాస్ ఫౌజీ కుమారుడు దేవాన్షు (22), పొరుగు గ్రామమైన సుల్తాన్పూర్కు చెందిన అశోక్ కుమార్ పాల్ కుమార్తె దీప్తి (21)తో మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఈ విషయం అమ్మాయి కుటుంబానికి తెలియగానే, వారు 15 రోజుల క్రితం ఔరయ్య జిల్లాలోని ఎర్వా కాత్రా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని చిత్తా గ్రామంలో ఆమెకు వివాహం ఏర్పాటు చేశారు. వివాహం చేసుకోబోయే అబ్బాయి తల్గ్రామ్ పట్టణంలో ఒక క్లినిక్ నడుపుతున్నాడు.
Also Read: నాకు దక్కనిది.. మరెవ్వరికి దక్కకూడదు.. యూపీలో ప్రేమోన్మాది ఘాతుకం
This case of a young man killing a girl and then committing suicide due to one-sided love is from Kannauj. Devanshu, son of a former soldier from the neighboring village Kothila, was in one-sided love with 19-year-old Deepti who lived here. He used to call Deepti often regarding pic.twitter.com/m1IOBIy2dy
— Makona (@nararam933) June 23, 2025
Also Read: ఉప ఎన్నికల్లో ఫలితాల్లో ఆప్ ప్రభంజనం.. షాక్లో బీజేపీ
వివాహం చేసుకోవద్దని బెదిరింపులు
దేవాన్షు తల్గ్రామ్ వెళ్లి ఆ అబ్బాయిని దీప్తిని వివాహం చేసుకోవద్దని బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. అందుకు అతను నిరాకరించాడు. అయితే సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో దేవాన్షు తన తండ్రి 12 బోర్ గన్తో సుల్తాన్పూర్కు వెళ్లి, తన చెల్లెలితో నిద్రిస్తున్న దీప్తిని నుదిటిపై కాల్చి చంపి అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం దేవాన్షు ఆమె ఇంటికి 20 మీటర్ల దూరంలో ఉన్న చెరువు ఒడ్డున తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలో వారిద్దరూ మరణించారు.
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
సంఘటన తర్వాత, దేవాన్షు కుటుంబం ఇంటికి తాళం వేసి పారిపోయింది. పోలీసులు రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం జిల్లా ప్రధాన కార్యాలయానికి పంపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. దీప్తి బీఎస్సీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని. ఆమెకు ఒక చెల్లెలు, ఒక సోదరుడు ఉండగా దేవాన్షుకు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. దీప్తి తండ్రి అశోక్ తల్గ్రామ్లోని విద్యుత్ శాఖలో లైన్మ్యాన్గా పనిచేస్తున్నారు.
Also Read: నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!