/rtv/media/media_files/2025/04/22/y2MdbBjZkZh8T94isTAo.jpg)
road-accident mp
మధ్యప్రదేశ్లోని దామో జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. నోహటా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 10:15 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సిమ్రి గ్రామ సమీపంలోని సునార్ నది వంతెన సమీపంలో 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వంతెనపై నుంచి వాహనం నదిలోకి పడిపోయింది. పోలీసు అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, వాహనంలో ఉన్నవారంతా జబల్పూర్ జిల్లా నివాసితులు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సోదరీమణులు, ఒక మేనకోడలు, మనవడు ఉన్నారు.
Tragic accident in Madhya Pradesh: An SUV falls off a bridge killing 8, including women and children. Rescue operations underway. #DamohTragedy
— RAW REPORT (@RawReport1) April 22, 2025
Celebrated Director @SasikumarDir returns to family movies with #TouristFamily, discusses his journey from #Subramaniapuram days in an…
Also read : మోదీకి సౌదీ పర్యటనలో ఫైటర్ జెట్ల ఎస్కార్ట్.. 6 విమానాలతో స్వాగతం (VIDEO)
ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే
వాహనంలోని ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా ఎనిమిది నుంచి పది సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు దామోహ్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయపడిన ప్రయాణికులకు దామోహ్లో చికిత్స అందించి, త్వరిత వైద్య సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రీన్ కారిడార్ ద్వారా జబల్పూర్ మెడికల్ కాలేజీకి తరలించారు. కుటుంబం ఇంత పెద్ద సంఖ్యలో కలిసి ప్రయాణించడానికి గల కారణం గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Also Read : కొంపముంచిన ఖలేజా టైటిల్.. అత్యాశకు పోతే రూ .10 లక్షలు బొక్కా
కాగా సోమవారం మధ్యప్రదేశ్ అంతటా మూడు వేర్వేరు ప్రమాదాలు సంభవించి మొత్తం పది మంది ప్రాణాలు కోల్పోయింది. సోమవారం జబల్పూర్-రైసెన్ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఓ పెళ్లికి వెళ్లి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read: జమ్మూకాశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. టూరిస్టులపై కాల్పులు !
Also Read: గూగుల్ లో వెతికి మరి చంపేసింది.. మాజీ డీజీపీ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!