/rtv/media/media_files/2025/05/02/Gf8t4ztKICjr5ooX2RZX.jpg)
up marriage
21 ఏళ్లలో 12 సార్లు పెళ్లి చేసుకుని, చాలా మంది యువకులను మోసం చేసి, వారి నుంచి డబ్బు, బంగారం దోచుకున్న ఓ యువతి ఎట్టకేలకు అరెస్టు అయింది. గుల్షానా రియాజ్ ఖాన్ అనే యువతి తన గ్యాంగ్ తో కలిసి ఏజ్ బార్ పురుషులను వెతికి మరీ పెళ్లి చేసుకుంటుంది. అలా పెళ్లైన గంటల్లోనే డబ్బు, బంగారం, విలువైన వస్తువులతో ఉడాయిస్తుంది. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు గుజరాత్లో కాజల్, హర్యానాలో సీమ, బీహార్లో నేహా, ఉత్తరప్రదేశ్లో స్వీటీగా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో పేర్లు మార్చుకునేది.
Also Read: Phalgam Attack: పాపం పాక్.. సొంత దేశం పేరెత్తడానికే భయపడుతున్న స్థానిక సెలబ్రెటీలు!-VIDEO
Also Read: Pahalgam Attack ఉగ్రదాడితో కఠిన చర్యలు.. పాకిస్థాన్ స్టార్స్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్..!
బాధితుడు పోలీసులను ఆశ్రయించగా
తాజాగా హర్యానాకు చెందిన సోను అనే ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించగా ఆమె గ్యాంగ్ లోని ఓ సభ్యుడు పోలీసులకు దొరకడంతో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది. ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్న ఈ ముఠాలో హర్యానా, జౌన్పూర్ కు చెందిన వ్యక్తులు ఉన్నారు. రియాజ్ ఖాన్ కు వీరు బంధువులుగా నటించడం నుండి పారిపోవడం వరకు ఈ ఆపరేషన్లో పాత్రలు పోషిస్తారు. వారినుంచి పోలీసులు రూ. 72,000 నగదు, బైక్ ,మంగళసూత్రం, 11 మొబైల్ ఫోన్లు,మూడు నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిలో మోహన్లాల్ (34), రతన్ కుమార్ సరోజ్ (32), రంజన్ అలియాస్ అషు గౌతమ్ (22), రాహుల్ రాజ్ (30), సన్నో అలియాస్ సునీత (36), పూనమ్ (33), మంజు మాలి (29), రుక్సర్ (21) ఉన్నారు. విచారణలో వీరంతా పెళ్లి పేరుతో 12 కుటుంబాలను మోసం చేసినట్లుగా అంగీకరించారు.
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
Also Read: Anu Aggarwal: నా మూత్రం నేనే తాగిన.. ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు: నటి సంచలనం!
Uttar Pradesh | marriage | cheating