/rtv/media/media_files/2025/08/12/vijay-rashmika-2025-08-12-16-03-34.jpg)
vijay- rashmika
43rd India Day Parade New York: అమెరికాలోని న్యూయార్క్లో జరిగే 43వ వార్షిక ఇండియా డే పరేడ్ వేడుక(43rd India Day Parade New York) ల్లో ప్రముఖ టాలీవుడ్ నటులు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(actress-rashmika-mandanna) సందడి చేయనున్నారు. ఈ పరేడ్ కి కో-గ్రాండ్ మార్షల్లుగా వ్యవహరించనున్నారు. ఆగస్టు 17న న్యూ యార్క్ మాడిసన్ అవెన్యూ వేదికగా "సర్వే భవంతు సుఖినః" అనే థీమ్తో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. శాంతి, సౌభ్రాతృత్వాన్ని కోరుతూ ఈ థీమ్ను ఎంచుకున్నట్లు ఎఫ్ఐఏ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్) అధ్యక్షుడు సౌరిన్ పారిఖ్ తెలిపారు. విదేశాల్లో భారత్ ప్రతిష్టను పెంచే కృషిగా ఈ పరేడ్ వేడుకలను నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా భారత కాన్సుల్ జనరల్ బినయ ఎస్. ప్రధాన్ మాట్లాడుతూ.. "అరవ శతాబ్దం నుంచి ఎఫ్ఐఏ అమెరికాలో భారత్ ప్రతిష్ఠను పెంచేందుకు కృషి చేస్తోంది. 1981లో ఒక చిన్న పరేడ్గా మొదలైన ఈ కార్యక్రమం ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఇండియా డే వేడుకగా పేరుగాంచింది" అని ఆనందం వ్యక్తం చేశారు. 1970లో స్థాపించబడిన ఎఫ్ఐఏ, భారతీయ సంస్కృతిని ప్రోత్సహిస్తూ, అమెరికా-భారత్ సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది.
ఎఫ్ఐఏ ఈ ఏడాది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అనేక కార్యక్రమాలను రూపొందించారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఆరు భాషల్లో (హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్) ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని పంపారు.
Also Read : రూ. 200 కోట్లతో నరసింహ గర్జన.. యానిమేషన్ చరిత్రలో కొత్త రికార్డు!
మూడు రోజుల వేడుకలు ఇవే
- ఆగస్టు 15న: పరేడ్కు ముందు శుక్రవారం రోజున వేడుకలు ప్రారంభమవుతాయి. ఎంపైర్ స్టేట్ భవనంపై త్రివర్ణ పతాక కాంతులు ప్రసరిస్తాయి.
- ఆగస్టు 16న: శనివారం రోజున టైమ్స్ స్క్వేర్లో భారత జెండా ఎగురవేసే కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. పరేడ్ వేడుకల్లో క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం ఇదే మొదటిసారి.
- ఆగస్టు 17న: ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు మాడిసన్ అవెన్యూలో ప్రధాన ఇండియా డే పరేడ్ మొదలవుతుంది. ఈ పరేడ్లో ఐఎస్కేఓఎన్ ఆధ్వర్యంలో రథయాత్ర కూడా జరుగుతుంది. పరేడ్ తర్వాత సిప్రియానీ వాల్ స్ట్రీట్లో గ్రాండ్ గాలా కార్యక్రమం ఉంటుంది.
Celebrating the Spirit of India in the Heart of New York! 🇮🇳
— VARAM🦋 (@VDKFANGIRL) August 12, 2025
The 43rd Annual India Day Parade, the world's largest celebration of India's Independence Day abroad, will be held on Sunday, August 17, 2025, at E38th Street & Madison Avenue, NYC.
This year's Grand Marshals are two… pic.twitter.com/SLokilIS5M
ఎఫ్ఐఏ ఛైర్మన్ అంకుర్ వైద్య మాట్లాడుతూ, "ఈ పరేడ్ లాజిస్టిక్స్ అన్నీ వాలంటీర్ల సహాయంతో జరుగుతాయి. ఇది డబ్బుతో కూడుకున్నది కాదు, ఇది దేశంపై ఉన్న అభిమానంతో పాల్గొనే వేడుక" అని అన్నారు. ఈ పరేడ్కు గ్రాండ్ మార్షల్గా హాజరు కావడం విజయ్, రష్మికకు లభించిన ఒక గొప్ప గౌరవంగా చెప్పవచ్చు అని తెలిపారు.
Also Read: రజనీకేనా విషెస్.. ఎన్టీఆర్కు లేవా.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ!