/rtv/media/media_files/2025/09/12/kangana-2025-09-12-14-53-21.jpg)
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రైతు నిరసనలపై చేసిన వివాదాస్పద ట్వీట్కు సంబంధించి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనపై పంజాబ్లో నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలంటూ కంగనా దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం "మీరు ఆ ట్వీట్కు మసాలా జోడించారు" అంటూ కంగనాకు చివాట్లు పెట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020-21 సంవత్సరంలో రైతులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా కంగనా రనౌత్ ఓ ట్వీట్ చేశారు. అందులో వృద్ధురాలైన మహిళా రైతును రూ.100 కోసం నిరసనల్లో పాల్గొన్నట్లు కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్పై రైతులు, రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో పంజాబ్లోని భటిండా జిల్లాలో ఆమెపై పరువు నష్టం, ఇతర ఆరోపణల కింద క్రిమినల్ కేసు నమోదైంది.
The Supreme Court today refused to entertain a petition filed by actress and BJP MP Kangana Ranaut for quashing of a criminal defamation complaint filed against her tweet about a woman-participant in the 2021 farmers' protests.
— Live Law (@LiveLawIndia) September 12, 2025
Read more: https://t.co/MXRVK2V1ar#SupremeCourt… pic.twitter.com/hlsFcJX7uC
ఆ కేసును రద్దు చేయాలని కోరుతూ కంగనా మొదట పంజాబ్, హర్యానా హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు ఆమె పిటిషన్ను తిరస్కరించింది. దీంతో ఆమె సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మోహతా ధర్మాసనం కంగనా న్యాయవాది వాదనలను విన్నది. "ఇది కేవలం ఒక ట్వీట్ కాదు, మీరు దీనికి అనవసరమైన 'మసాలా' జోడించి రైతులను అవమానపరిచారు" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యల అనంతరం కంగనా పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో కంగనా రనౌత్ ఇప్పటివరకు పదే పదే చట్టపరమైన మార్గాలను ఆశ్రయించినా, ఆమెకు నిరాశే ఎదురవుతోంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఈ వివాదం మరింత పెద్దది అయ్యే అవకాశముంది.