Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్‌తో సుకుమార్‌ నెక్స్ట్ మూవీ.. రిలీజ్ అప్పుడే?

డైరెక్టర్ సుకుమార్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్‌తో తన తర్వాత సినిమా తీయబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుకుమార్ ముంబై కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

New Update
Sharukh-Sukumar

Sharukh-Sukumar Photograph: (Sharukh-Sukumar)

పుష్ప మూవీతో సుకుమార్ ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. సుకుమార్ కోసం స్టార్ హీరోలంతా కూడా లైన్ కడుతున్నారు. అయితే ప్రస్తుతం సుకుమార్ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

సినిమా కోసం సుకుమార్ ముంబైకి కూడా వెళ్లినట్లు..

సౌత్ డైరెక్టర్ అట్లీతో షారుఖ్ ఖాన్ గతంలో కలిసి పనిచేశాడు. జవాన్ మూవీ తీయగా ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు మళ్లీ సుకుమార్‌తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం సుకుమార్ ముంబైకి కూడా వెళ్లినట్లు సమాచారం. దీనికి సంబంధించి ఎలాంటి ఫొటోలు కూడా బయటకు రాలేదు.

ఇది కూడా చూడండి: నీ మొగుడ్ని వదిలేసి రా.. హైదరాబాద్ మహిళకు ఎన్ఆర్ఐ వేధింపులు

ప్రస్తుతం సుకుమార్ హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బదులుగా తెలుగు చిత్రాలను తెరకెక్కించి వాటిని పాన్-ఇండియన్ స్థాయిలో విడుదల చేయడానికి సుక్కూ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు 2023లో, షారుఖ్ ఖాన్ చిత్రాలు ‘పఠాన్’, ‘జవాన్’, ‘డంకీ’ విడుదలయ్యాయి. 2024లో అతని సినిమాలు ఏవీ విడుదల కాలేదు. 

ఇది కూడా చూడండి:  Betting App Case: ఎవ్వరినీ వదలకండి.. అందరిని జైల్లో వేయండి- పోలీసులకు మైనంపల్లి ఫిర్యాదు!

ఇదిలా ఉండగా షారుఖ్ ఖాన్ ఇప్పుడు కొత్త సినిమాలు ఏవి కూడా అంగీకరించలేనట్లు తెలుస్తోంది. కొత్త సినిమాల గురించి కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మరి త్వరలో వీటిపై ఎలాంటి అధికార ప్రకటన చేస్తారో చూడాలి.

ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

#AA22xA6: వామ్మో.! ఒక్క హీరో కోసం ముగ్గురు స్టార్ హీరోయిన్లు.. అట్లీ ప్రాజెక్ట్ పై పెరుగుతున్న అంచనాలు

అల్లు అర్జున్ - అట్లీ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరలవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా ఈ ప్రాజెక్ట్ లో బాగమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాన్వీ, మృణాల్ ఇద్దరు హీరోయిన్లు ఇందులో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

New Update

#AA22xA6:  అల్లు అర్జున్ - అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాపై  పై రోజురోజుకు అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ మరింత క్యూరియాసిటీని పెంచేలా ఉంది. ఇప్పటికే ఈమూవీలో అల్లు అర్జున్ జోడీగా మృణాల్, జాన్వీ ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతున్నట్లు నెట్టింట ప్రచారం జోరుగా జరుగుతోంది. కాగా, ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. 

ముగ్గురు హీరోయిన్లు 

 తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కూడా అల్లు అర్జున్- అట్లీ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు ఒకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో అల్లు అర్జున్ మూడు డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నారట. దీంతో ముగ్గురు హీరోయిన్లు బన్నీ  జోడీగా మెరవనున్నట్లు సమాచారం.  అల్లు అర్జున్, దీపికా, అట్లీ పవర్ ఫుల్ కాంబో కలిసి రావడం ఫ్యాన్స్ లో మరింత ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు ఈ సినిమా కోసం దీపికా ప్రభాస్ 'స్పిరిట్' నుంచి తప్పుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్. 

ఇదిలా ఉంటే ఇటీవలే  ముంబై బాంద్రాలోని మోహబూబా స్థూడియోస్ లో అల్లు అర్జున్ లుక్ టెస్ట్, కాన్సెప్ట్ ఫొటో షూట్ జరిగాయి.  బన్నీ పాత్ర కోసం డైరెక్టర్ అట్లీ డిఫరెంట్ లుక్స్ అన్వేషించారట. రగ్గడ్ నుంచి స్టైలిష్ వరకు ఇలా చాలా ట్రై చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ని ఓ భిన్నమైన ఇమేజ్ తో పరిచయం చేయాలని అనుకుంటున్నారట అట్లీ.

telugu-news | cinema-news | latest-news | Allu Arjun – Atlee Allu Arjun – Atlee 

Also Read: Iswarya Menon: నడుము అందాలు చూపిస్తున్న ఐశ్వర్య.. హాట్ లుక్స్‌లో పిచ్చెక్కిస్తుందిగా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు