/rtv/media/media_files/2025/03/31/r6PIluh0EyRuLSVVygky.jpg)
Subham
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల శుభం చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు రాబట్టడంతో పాటు హిట్ టాక్ను కూడా సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సంస్థతో డిజిటల్ రైట్స్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 5వ తేదీ నుంచి శుభం చిత్రం ఓటీటీలోకి రానున్నట్ల సమాచారం. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్
జీ తెలుగు సొంతం చేసుకున్నట్లు..
ఈ మూవీ శాటిలైట్ హక్కుల జీ తెలుగు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. సమంతకు భారీ క్రేజ్ వల్ల ఈ బిగ్ డీల్ ఫిక్స్ అయినట్ల సమాచారం. ఇక సమంత నిర్మాతగా చిన్న సినిమాలపై ఫోకస్ పెడుతుంని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నటిగా ఆమె కెరీర్ కొనసాగిస్తారో లేదా నిర్మాతగా కెరీర్ను కొనసాగిస్తారో లేదో అన్ని విషయం తెలియాలి.
ఇది కూడా చూడండి: Ind-Pak war: చైనా ఎయిర్ డిఫెన్స్ రక్షణ వ్యవస్థలు 23 నిమిషాల్లోనే ధ్వంసం..కేంద్రం
ఇదిలా ఉండగా ఈ మూవీకి తొలి వీకెండ్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా రూ.5.25 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించిందని నిర్మాతలు వెల్లడించారు ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని ముఖ్య పాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం ‘శుభం’ మంచి మౌత్ టాక్తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఇకపోతే, ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం ఎంత మొత్తంలో వసూళ్లు రాబడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చూడండి: Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు