/rtv/media/media_files/2025/05/17/GDGWqDLAEPRRgpYQqUUM.jpg)
MOHAN BABU UNIVERSITY INCIDENT
Mohan Babu University: మోహన్ బాబు యూనివర్సిటీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. యూనివర్సిటీకి చెందిన జేమ్స్ అనే విద్యార్ధి షేర్ చేసిన సెల్ఫీ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. తన జూనియర్ విద్యార్ధి తనను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థి జేమ్స్ ను కిడ్నాప్ చేసి దాడి..
— RTV (@RTVnewsnetwork) May 17, 2025
తన జూనియర్ యశ్వంత్ కులం పేరుతో దూషిస్తూ అవమానిస్తుంటే మందలించిన జేమ్స్..
13వ తేది మంగళం దగ్గర యశ్వంత్ కొందరు రౌడీ షీటర్లు తనను కిడ్నాప్ చేశారన్న జేమ్స్..
రెండు రోజులు ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేశారని… pic.twitter.com/sD721sghJ1
Also Read : వర్షిణి కావాలి.. జైలులో పూజలు చేస్తున్న అఘోరీ!
అసలేం జరిగింది..
అయితే జూనియర్ విద్యార్ధి యశ్వంత్ కులం పేరుతో దూషిస్తూ అవమానిస్తుంటే.. జేమ్స్ అతడిని మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న యశ్వంత్ 13వ తేదీన కొందరు రౌడీ షీటర్లతో కలిసి జేమ్స్ ను కిడ్నాప్ చేయించాడు. ఆ తర్వాత రెండు రోజులపాటు గదిలోనే ఉంచి చిత్రహింసలకు చేశాడని. మూత్రం ను తాగించి విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు జేమ్స్. బాధితుడి ఫిర్యాదుతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన తిరుచానూరు పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read: Bakasura Trailer: షాకయ్యారా.. 'బకాసురా' ట్రైలర్ లో ఉప్పల్ బాలు ఎంట్రీ! ట్రైలర్ ఇక్కడ చూడండి
గతంలో..
గతంలో మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల అక్రమాలపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఫీజులతో పేరుతో వేధిస్తున్నారని ఏఐసీటీఈకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ కూడా యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తన పోరాటం ఆస్తుల కోసం కాదని, విద్యార్థులు భవిష్యత్తు కోసమని బహిరంగంగా మాట్లాడారు.
latest-news | telugu-news | cinema-news | mohan-babu-university
Also Read : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 35 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్!