తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా హల్ చల్ చేసిన లేడీ ఆఘోరీ ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉంది. తనను పెళ్లి చేసుకుని వాడుకుని వదిలేసిందంటూ కరీంనగర్కు చెందిన ఓ యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లేడీ ఆఘోరీని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న అఘోరి వర్షిణి కోసం జైలు అధికారులతో ప్రతి రోజూ గొడవకు దిగుతున్నట్లుగా సమాచారం. వర్షిణిని కలిపించాలంటూ రచ్చ రచ్చ చేస్తుందట ఆఘోరీ. ఇక జైలులోనూ అఘోరీ పూజలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
వర్షిణి కోసం పూజలు
పక్కనే ఉన్న మాదన్నపేట మార్కెట్ నుంచి అఘోరీకి పూజ సామాగ్రి తెప్పించుకోని వర్షిణి కోసం పూజలు చేస్తుందని సమాచారం. మూడు పూటలు కడుపు నిండా తింటున్న అఘోరీ.. తనకు డ్రై ఫ్రూట్స్ కావాలంటూ జైలు అధికారులతో రోజూ గొడవకు దిగుతుందట. కాగా మొన్న అఘోరీ శ్రీనివాస్తో అతని సోదరి ములాఖత్ అయింది. సోదరికి బ్యాంక్ డీటైల్స్ చెప్పిన అఘోరీ.. ఎవరికీ ఏం చెప్పొద్దు, మీడియాతో అస్సలు మాట్లడొద్దని సోదరిని హెచ్చరించినట్లు సమాచారం. ప్రస్తుతం జైల్లోని ప్రత్యేక బ్యారక్లో, సీసీ కెమెరా నిఘాలో అఘోరీ ఉంది. బెయిల్ కోసం గట్టిగా ప్రయత్నిస్తుంది. ఒకవేళ పీటీ వారెంట్తో బయటకు వచ్చిన వెంటనే మళ్లీ ఆఘోరీని అరెస్ట్ చేసే ప్లాన్లో తెలంగాణ పోలీసులు ఉంటున్నట్లుగా తెలుస్తోంది.
lady-aghori | hyderabad | chanchalguda-jail | telangana | telugu-news