Megastar Chiranjeevi: అమరావతిలో ప్రధాని సభకు చిరంజీవి డుమ్మా.. అసలు కారణం ఇదే..!!

అమరావతి పునఃప్రారంభోత్సవ వేడుకకు ఆహ్వానం అందినా.. చిరంజీవి హాజరుకాకపోవడంపై రాజకీయంగా చర్చనీయాంశమైంది. గత వైసీపీ హయాంలో జగన్ చేసిన మూడు రాజధానుల ఆలోచననను సరైన నిర్ణయంగా చిరు పేర్కొన్నారు. ఈ కారణంతోనే చిరు ఈ వేడుకకు హాజరు కాలేదని తెలుస్తోంది.

New Update
megastar chiranjeevi skips amaravati re launch event whats the reason

megastar chiranjeevi skips amaravati re launch event whats the reason

అమరావతి పునఃప్రారంభోత్సవ వేడుకలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందడి చేశారు. ఇందులో భాగంగానే పలు కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సభకు పలువురు ప్రముఖులను స్పెషల్‌గా ఇన్వైట్ చేసింది. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా గత కొంత కాలంగా మోదీకి, చిరంజీవికి మధ్య మంచి అనుబంధం కూడా ఉంది. 

Also Read: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!

చిరుకి ప్రత్యేక ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, పవన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సైతం చిరంజీవికి మోదీ ప్రత్యేక ప్రధాన్యత ఇచ్చారు. మెగా బ్రదర్స్‌తో కలిసి చేతులు పైకెత్తి సందడి చేశారు. దీంతో ఈ సభకు చిరు హాజరవుతారని అందరూ భావించారు. కానీ ఈ కార్యక్రమానికి ఆయన రాకపోవడంతో ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే దీనికీ ఓ బలమైన కారణం ఉందంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. 

Also Read: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

గతంలో షాకింగ్ వ్యాఖ్యలు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమనే చర్చలు నడుస్తున్నాయి. అప్పట్లో జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానుల నిర్ణయాన్ని చిరంజీవి ఏకీభవించారు. జగన్ చేసిన మూడు రాజధానుల ఆలోచననను సరైన నిర్ణయంగా చిరు పేర్కొన్నారు. అమరావతి కోసం అక్కడి రైతుల నుంచి భూ సేకరణ ఆలోచన సరైనది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

Also Read: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

కారణం ఇదే

దీంతో గతంలో చిరు చేసిన వ్యాఖ్యల వీడియోలను కొందరు సోషల్ మీడియాలో షేర్లు చేసి.. ఇలాంటి వ్యక్తిని సభకు ఎలా పిలుస్తారనే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ కారణంతోనే చిరంజీవి అమరావతి పునఃప్రారంభోత్సవ వేడుకకు హాజరు కాలేదని కొందరు చర్చించుకుంటున్నారు. ఈ సభకు హాజరై వివాదాల్లో చిక్కుకోవడం ఇష్టం లేకే ఆయన డుమ్మా కొట్టాడని పొలిటికల్ సర్కిల్‌లో చర్చ నడుస్తోంది. మరోవైపు ముంబాయ్‌లో జరిగిన వేవ్స్ సదస్సులో చిరంజీవి పాల్గొన్నారని.. అందువల్లనే ఆయన రాలేకపోయారని మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. 

Also Read: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్‎లో టెన్షన్ టెన్షన్..!

megastar-chiranjeevi | amaravati capital constraction | cm chandrababu | Pawan Kalyan | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు