SSMB29 Movie: హీరోతో సహా అందరికీ ఈ షరతులు వర్తిస్తాయి: రాజమౌళి మాస్ వార్నింగ్!

మహేశ్‌బాబు 'SSMB29'కి సంబంధించి ఎవరైనా సమాచారాన్ని లీక్‌ చేస్తే భారీగా మూల్యం చెల్లించాల్సిందేనని రాజమౌళి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. చిత్ర యూనిట్ కి కొన్ని షరతులు పెట్టాడట. హీరోతో సహా సెట్‌లో ఉన్న వారెవరూ ఫోన్‌లు తీసుకురావడానికి వీల్లేదని చెప్పారట.

New Update
mahesh babu ssmb 29 update

mahesh babu ssmb 29 update

మహేశ్ బాబు - రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం '#SSMB29'. అందరి కళ్లు ఇప్పుడు ఈ సినిమాపైనే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందిస్తున్నాడు. 

ఇప్పటికైతే ఈ మూవీలో మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా నటిస్తున్నట్లు కొన్ని అప్డేట్లు బయటకు వచ్చాయి. అంతకు మించి మరే ఇతర అప్డేట్ కూడా బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఇటీవలే రాజమౌళి ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. మహేశ్ బాబు పాస్ పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నట్లు అర్థం వచ్చేలా ఓ వీడియోను షేర్ చేశారు. 

జక్కన్న జాగ్రత్తలు

ఇది కూడా చూడండి: Kerala: ఆ మ్యాన్‌ ఈటర్‌ కనిపిస్తే చంపేయండి..ప్రభుత్వం ఆదేశాలు!

దీంతో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయినట్లు నెట్టింట చర్చ నడిచింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం దాదాపు రూ.1000 కోట్లతో తెరకెక్కనుందని సమాచారం. అందువల్ల ఈ సినిమాకి సంబంధించిన ఏ ఒక్క సమాచారాన్ని బయటకు లీక్ కాకుండా చూస్తున్నాడు జక్కన్న. ఇందులో భాగంగానే తమ టీమ్ కు గట్టి వార్నింగే ఇచ్చాడట. 

భారీగా మూల్యం చెల్లంచాల్సిందే

ఇది కూడా చూడండి:  Donald Trump: ఇజ్రాయెల్‌ కి మళ్లీ బాంబులు..బైడెన్‌ విధించిన నిషేధాన్ని ఎత్తేసిన కొత్త అధ్యక్షుడు!

ఈ సినిమాకి సంబంధించిన నటీ నటులు, ఇతర టెక్నీషియన్ల సహా చిత్ర యూనిట్ అంతటికి హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. వారితో నాన్ డిస్ క్లోజ్ అగ్రిమెంట్ చేయించినట్లు కొన్ని వార్తలు నెట్టింట జోరుగా సాగాయి. అంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏ విషయాన్ని లీక్ చేయడానికి వీల్లేదు అన్నమాట. ఒకవేళ ఎవరైనా లీక్ చేసినట్లు రుజువు అయితే అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. 

అంతేకాకుండా ఎవరైతే సెట్ లో అడుగుపెడతారో వారెవరూ ఫోన్లు వాడకూడదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలు హీరోకి కూడా ఉన్నట్లు తెలిసింది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి జక్కన్న ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటాడో.

Advertisment
Advertisment
తాజా కథనాలు