Junior NTR : ఒకే వేదికపై బాలయ్య, ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పండగే

'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రాలో నిర్వహించనున్నట్లు నిర్మాత నాగవంశీ తాజా ప్రెస్ మీట్లో వెల్లడించారు.ఈ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఎలాగైనా తారక్ ను ఒప్పించి ఈ ఈవెంట్ కు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. 

New Update
Balakrishna ntr

Balakrishna ntr

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్'. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకుంది.

రిలీజ్ టైం దగ్గర పడటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే తాజాగా చిత్ర బృందం ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో నిర్మాత నాగవంశీ సినిమాకు సంబంధించి పలు ఈవెంట్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. 

ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్..

అంతేకాకుండా 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రాలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ముఖ్యంగా నాగవంశీ.. ఎలాగైనా తారక్ ను ఒప్పించి ఈ ఈవెంట్ కు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. 

నాగవంశీతో ఎన్టీఆర్ కు మంచి బాండింగ్ ఉంది. సో అతను అడిగితే తారక్ కాదనడు. అంటే బాబాయ్ ఈవెంట్ కి అబ్బాయి కచ్చితంగా వెళ్లే ఛాన్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. 

బాలయ్య, ఎన్టీఆర్ ఒకే వేదికపై కనిపించి చాలా కాలం అవుతోంది. నాగవంశీ ప్రయత్నం ఫలిస్తే.. మళ్ళీ నందమూరి హీరోలను ఒకే వేదికపై చూడొచ్చు. అదే జరిగితే ఫ్యాన్స్ కు పండగే అని చెప్పొచ్చు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు