'బిగ్ బాస్- 8' గ్రాండ్ ఫినాలే ఈ రోజే.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే నేటి సాయంత్రం జరగనుంది. తాజాగా అందుకు సంబంధించి ప్రోమో వదిలారు. అందులో ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూపించారు. అలాగే ఈ సీజన్ విన్నర్ కి టైటిల్‌ తో పాటూ రూ. 55 లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు చెప్పారు.

New Update

ప్రముఖ తెలుగు బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ సీజన్ 8' ఎట్టకేలకు ముగుంపు దశకు చేరుకుంది. దాదాపు 100 రోజులకు పైగా ఆడియన్స్ ను అలరించిన ఈ షో నేటి సాయంత్రం గ్రాండ్ ఫినాలే ను జరుపుకోబోతోంది. ఎప్పటిలాగే ఈసారి ఫినాలే ఎపిసోడ్ కు సెలెబ్రిటీలతో పాటూ ఈ సీజన్‌లో పాల్గొని ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌ అందరూ వచ్చారు.

తాజాగా అందుకు సంబంధించి ప్రోమో వదిలారు. అందులో ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూపించారు. హీరోయిన్ల స్పెషల్ డ్యాన్స్ పెర్ఫార్మెన్సులు ప్రోమోలో హైలైట్ గా నిలిచాయి. ఇక టాప్‌ 5లో ఉన్న నిఖిల్‌, గౌతమ్‌, ప్రేరణ, నబీల్‌, అవినాష్ లపై నాగార్జున పంచులు వేసి నవ్వులు పూయించారు. 

Also Read: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!

ఇక ఇదే ప్రోమోలో విన్నర్ ప్రైజ్ మనీ కూడా రివీల్ చేశారు. ఈ సీజన్‌ ప్రైజ్‌మనీ రూ.54,99,999 అని ప్రకటించిన నాగార్జున దానిని రూ.55 లక్షలుగా నిర్ణయించారు. గెలిచిన విజేతకు టైటిల్‌తోపాటు ఈ క్యాష్‌ ప్రైజ్‌ ఇవ్వనున్నట్లు చెప్పారు. గత సీజన్స్ తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీ ఐదు లక్షల వరకు పెంచడం విశేషం.

విన్నర్ అతనేనా?

బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకరేమో నిఖిల్ విన్నర్ అంటూ చెబుతున్నారు. రన్నరప్‌లో గౌతమ్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎంత వరకు నిజం ఉందో తెలీదు. ఇవాళ్టితో దానికి శుభం కార్డు పలకనున్నారు.

Also Read: అమెరికాలో భారి యాక్సిడెంట్.. తెనాలి విద్యార్థిని మృతి!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు