Phone Users: స్మార్ట్‌ఫోన్ ఉందా.. అయితే ఈ అదిరిపోయే శుభవార్త మీ కోసమే!

స్మార్ట్‌ఫోన్లకు నేరుగా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు వోడాఫోన్ ఐడియా నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన శాటిలైట్ల తయారీ సంస్థ ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. త్వరలోనే ఈ సేవలు దేశంలో ప్రారంభం కానున్నాయి.

author-image
By Kusuma
New Update
Smart Phone

Smart Phone

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు వొడాఫోన్ ఐడియా గుడ్ న్యూస్ తెలిపింది. వీరికి నేరుగా శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు అమెరికాకు చెందిన శాటిలైట్ల తయారీ సంస్థ ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వొడాఫోన్‌ ఐడియా తెలిపింది. ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌కు పోటీ సంస్థే ఏఎస్‌టీ. అయితే అంతరిక్ష ఆధారిత సెల్యులార్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను తీసుకొస్తున్న మొదటి కంపెనీ ఇదే.

ఇది కూడా చూడండి: IND vs ENG : వాళ్లు లేకుండా ఆడటం కష్టమే.. రాహుల్ ఎమోషనల్ కామెంట్స్!

ఇది కూడా చూడండి: Jagan: 'నేనొస్తే ఆంక్షలెందుకు'.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

ఒప్పందం చేసుకున్నట్లు..

దీన్ని వాణిజ్య సేవలు, ప్రభుత్వ అప్లికేషన్ల కోసమే డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే దీన్ని దేశంలో మొబైల్ నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో విస్తరించాలని ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ లేకుండా స్మార్ట్‌ఫోన్లకు నేరుగా స్పేస్‌ ఆధారిత సెల్యులార్‌ నెట్‌వర్క్‌ను అందించేలా ఏఎస్‌టీ, వొడాఫోన్‌ ఐడియా ఒప్పందం చేసుకుంది. 

ఇది కూడా చూడండి: Coriander Seed Water: కొత్తిమీర గింజల నీరు ఒక దివ్యౌషధం. దీని ప్రయోజనాలను తెలుసుకోండి!

అలాగే అంతరిక్షం నుంచి నేరుగా స్మార్ట్‌ఫోన్లకు 4జీ, 5జీ  సేవలు అందిస్తామ’ని ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ క్రిస్‌ ఐవరీ తెలిపారు. అయితే ఈ స్టార్ లింక్ సేవలు పొందాలని అనుకునే వారు ప్రత్యేకంగా పరికరాలు కొనాల్సి ఉంటుంది. దేశంలో జియో, ఎయిర్‌టెల్ కూడా ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. తక్కువ ధరకే దేశంలో ఈ సేవలను ఇస్తోంది. అయితే దేశంలో ఈ సేవలు ఎప్పుడు వొడాఫోన్‌ ఐడియా ఇంకా వెల్లడించలేదు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisment