RBI సంచలన ప్రకటన..మార్కెట్ లోకి కొత్త రూ. 20 నోటు..మరీ పాతవి చెల్లవా?

దేశంలో కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకి రానున్నాయి. మహాత్మా గాంధీ కొత్త సిరీస్‌ కింద రూ. 20 నోట్లను రిలీజ్ చేయనున్నట్లుగా ఆర్బీఐ శనివారం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. వాటిపై కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. పాత నోట్ల లాగే కొత్త నోట్లు ఉంటాయి.

New Update
rbi-20-note

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన ప్రకటన చేసింది. దేశంలో కొత్త కరెన్సీ నోట్లు అందుబాటులోకి రానున్నాయి. మహాత్మా గాంధీ కొత్త సిరీస్‌ కింద రూ. 20 నోట్లను రిలీజ్ చేయనున్నట్లుగా ఆర్బీఐ శనివారం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. వాటిపై కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. రాబోయే కొత్త రూ. 20నోట్లు్ కూడా పాత వాటి మాదిరిగానే  ఉంటాయని ఆర్బీఐ వెల్లడించింది. కొత్త గవర్నర్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆర్బీఐ కొత్త నోట్లను రిలీజ్ చేస్తూ ఉంటుంది. గతంలో రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన అన్ని రూ.20 డినామినేషన్ నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయని కూడా ఆర్బీఐ  తెలిపింది. కాగా సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 2024లో భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.  

Also Read :  అమెరికాలో ఉంటున్న భారతీయులకు బిగ్ షాక్.. ఎంబసీ కీలక ఆదేశం

RBI To Issue New Rs 20 Notes

Also Read :  జలియన్‌వాలా బాగ్‌ మారణకాండ.. కేసరి చాప్టర్ 2 తెలుగు ట్రైలర్!

Also Read :  కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే మీ స్పెర్మ్ కౌంట్ను చెక్ చేసుకోండి!

Also Read :  పాకిస్థాన్ స్పైగా ఇండియన్ యూట్యూబర్.. మొత్తం ఆరుగురు అరెస్ట్! ఆ రాష్ట్రాల్లో వీరి నెట్ వర్క్

reserve-bank-of-india | business | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు