/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Amul-Milk-Price-Hike.jpg)
Amul Milk price Hike
మదర్ డెయిరీ పాల ధరలను పెంచిన వెంటనే.. అమూల్ డెయిరీ కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు కూడా నేటి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. లీటర్కు రూ.2లు పెంచుతున్నట్లు అమూల్ డెయిరీ ప్రకటించింది. అయితే అమూల్ స్టాండర్డ్ మిల్క్, బఫెలో మిల్క్, గోల్డ్, స్లిమ్, ట్రిమ్, టి-స్పెషల్, తాజా, కౌ మిల్క్ ధరలు కూడా పెరిగాయి. గతంలో 500 మి.లీ బఫెలో ఫుల్ క్రీమ్ మిల్క్ రూ.36కి దొరికేది. కానీ ఇప్పుడు ఆ పాలు రూ.37కి అమ్ముతున్నారు. అదే లీటరు పాలు గతంలో రూ.71 ఉండగా ఇప్పుడు రూ.73కి లభిస్తుంది. ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల అమూల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
ఇది కూడా చూడండి:BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
#AccheDin #ThankYouModiji
— Janak Keshriya (@jskeshriya) May 1, 2025
3 Major #Milk brands, #Amul #Gowardhan & #MotherDairy increased prices by upto Rs.2 per litre.#AmrutKaal #ViksitBharat pic.twitter.com/OCVEmn6kU0
ఇది కూడా చూడండి: CSK VS PBKS: ధనా ధన్.. సామ్ కరన్ కుమ్మేశాడు - పంజాబ్ కింగ్స్కు కిక్కు దిగే టార్గెట్!
ముడి పదార్థాల ధరలు భారీగా పెరగడంతో..
ముడి పదార్థాల ధరలు భారీగా పెరగడంతోనే మదర్ డెయిర్ కూడా పాల ధరలను పెంచినట్లు తెలిపింది. మదర్ డెయిరీ తన అవుట్లెట్లు, రిటైలర్లు, ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా ఢిల్లీ-నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సిఆర్) మార్కెట్లో రోజుకు దాదాపు 35 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తుంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్ వంటి ఇతర రాష్ట్రాలలో కూడా పాలను విక్రయిస్తోంది. గత కొన్ని నెలలుగా కొనుగోలు ఖర్చు లీటరుకు నాలుగు నుంచి ఐదు రూపాయలు మాత్రమే పెరిగింది. అయితే ప్రస్తుతం వేసవి కాలం కావడంతో.. వేడి గాలుల వల్ల సేకరణ ఖర్చు పెరుగుతుందనే కారణంతో పెంచినట్లు తెలిపింది.
ఇది కూడా చూడండి: CSK VS PBKS: పంజాబ్ కింగ్స్ చితక్కొట్టేసింది..చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి
ఢిల్లీ ఎన్సిఆర్లో టోన్డ్ మిల్క్ (బల్క్) ధర లీటరుకు రూ.54 నుంచి రూ.56కి పెరిగింది. ఫుల్-క్రీమ్ పాలు (పౌచ్), టోన్డ్ పాలు (పౌచ్) ధర లీటరుకు రూ.1 పెరిగి లీటరుకు రూ.69 అయ్యింది. డబుల్ టోన్డ్ పాలు లీటరుకు రూ.2 పెరిగి ఇప్పుడు లీటరుకు రూ.51 అయింది. ఆవు పాలను లీటరుకు రూ.57 నుంచి రూ.59కి మదర్ డెయిరీ పెంచింది. మదర్ డెయిరీ 500 మి.లీ ప్యాక్లలో ఫుల్-క్రీమ్, టోన్డ్, డబుల్-టోన్డ్, ఆవు పాల ధరలను లీటరుకు 1 రూపాయలు పెంచింది. అర లీటరు ఫుల్ క్రీమ్ పాలు రూ.35, టోన్డ్ పాలు రూ.29, డబుల్ టోన్డ్ పాలు రూ.26, ఆవు పాలు రూ.30గా నిర్ణయించారు.
ఇది కూడా చూడండి: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..