Lok Sabha Elections : కేంద్రంలో అధికారంలోకి రావాలంటే లోక్సభ ఎన్నికల్లో 272 సీట్ల మెజార్టీ రావాలి. అయితే దేశంలో అత్యధిక ఎంపీ సీట్లున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh). ఇక్కడ మొత్తం 80 స్థానాలున్నాయి. కేంద్రంలో అధికారాన్ని కట్టబెట్టేందుకు యూపీ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. 2014 నుంచి భారీ అధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ (BJP) కి 2024 ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బే తగిలింది. మోదీ (PM Modi), యోగీ వేవ్ ఇక్కడ కనిపించలేదు. ఎన్డీయే కంటే ఇండియా కూటమికే ఇక్కడ ఎక్కువ స్థానాలు వచ్చాయియ 2014లో బీజేపీ ఏకంగా 73 స్థానాల్లో గెలిచింది. 2019లో సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ కలిసిపోటీ చేయడంతో బీజేపీకి 64 స్థానాలే వచ్చాయి. ఈసారి జరిగిన ఎన్నికల్లో మాత్రం కేవంల 33 స్థానాలతోనే సరిపెట్టుకుంది. అంటే దాదాపు సగం సీట్లు తగ్గిపోయాయి.
పూర్తిగా చదవండి..Yogi Adityanath : యూపీలో బీజేపీ ఘోర పరాజయం.. యోగీని మారుస్తారా ?
లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఘోరంగా ఓటమిపాలయ్యింది. 2019 ఎన్నికల్లో 64 ఎంపీ సీట్లు రాగా ఈసారి 33 స్థానాలకు పడిపోయింది. మోదీ -యోగీ వేవ్ అక్కడ కనిపించలేదు. దీంతో యోగీ ఆదిత్యనాథ్ను యూపీ సీఎంగా కొనసాగిస్తారా లేదా అనేది చర్చనీయం అవుతోంది.
Translate this News: