author image

BalaMurali Krishna

అమరావతి సచివాలయం సమీపంలో బైక్ రేసింగ్‌లు
ByBalaMurali Krishna

తెలిసీ తెలియని వయసు. హీరోగా ఫీలయ్యే యాటిట్యూడ్. మనల్ని ఎవడ్రా ఆపేది అనే దూకుడుతనం. వెరసి కొంతమంది యువకులు ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. ఉడుకు రక్తంతో రాజధాని అమరావతి ప్రాంతంలో బైక్ రేసులు నిర్వహిస్తూ తల్లిదండ్రుల ఆశలను వమ్ముచేస్తున్నారు.

మణిపూర్ అంశంపై దద్దరిల్లిన పార్లమెంట్.. లోక్‌సభ వాయిదా
ByBalaMurali Krishna

మణిపూర్ అంశంపై విపక్షాలు ఎప్పటిలాగే పార్లమెంట్ ఉభయ సభలనూ స్తంభింపజేశాయి. సోమవారం ఉదయం 11 గంటలకు సభ సమావేశం కాగానే ప్రతిపక్ష ఎంపీలు.. దీనిపై వెంటనే చర్చ చేపట్టాలని, ప్రధాని మోదీ ప్రకటన చేయాలని నినాదాలు చేశారు. ముఖ్యమైన బిల్లులు పెండింగులో ఉన్నాయని, వీటిపై చర్చించాలన్న లోక్ సభ స్పీకర్ సూచనను వారు పట్టించుకోలేదు. వారి రభసతో సభ మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా పడింది.

గోదారోళ్ల యాసలో అదరగొట్టిన విశ్వక్‌సేన్
ByBalaMurali Krishna

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ ఇప్పటివరకు తెలంగాణ యాస, భాషలో అదరగొట్టాడు. తొలిసారిగా గోదావరి యాసలో ఓ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో నటిస్తున్నాడు. 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటుంది.

ఏపీలో మారనున్న రైల్వేస్టేషన్ల రూపురేఖలు
ByBalaMurali Krishna

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అమృత్ భారత్ స్టేషన్ స్కీం కింద ఏపీలోని రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారనున్నాయి. ముందుగా తొలి దశలో విజయవాడ డివిజన్‌లోని మొత్తం 11 స్టేషన్లను తొలిదశలో ఎంపిక చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..  ఈ విషయాలు తెలుసుకోండి
ByBalaMurali Krishna

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి ఎదురుచూసే భక్తులు ప్రస్తుతం ఎలాంటి వెయిటింగ్ లేకుండా ఈజీగా దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీ తగడంతో టీటీడీ అధికారులు నో వెయిటింగ్ రూల్‌ అమలు చేస్తున్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుడిపైనే థర్డ్ డిగ్రీ?
ByBalaMurali Krishna

చట్టం ఇచ్చిన ప్రత్యేక అధికారంతో కొంతమంది పోలీసులు రెచ్చిపోతున్నారు. చట్టాలను చుట్టాలుగా చేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి రక్షకభటులతో పోలీస్‌ వ్యవస్థకు చెడ్డపేరు వస్తుంది. న్యాయం చేయాలంటూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన భాదితుడిపైనే ధర్డ్ డిగ్రీ చేసిన ఘటన ఏలూరు పట్టణంలో జరిగింది.

ఐఐటీ బాంబేలో మరోసారి రాజుకున్న వెజ్-నాన్ వెజ్ వివాదం
ByBalaMurali Krishna

భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశం ప్రత్యేకత. రకరకాల మతాలు, భాషలు, ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఎవరికి నచ్చినట్లు వారు జీవిస్తుంటారు. ఇందులో ఇతరులు కలుగజేసుకోవడం సమంజసం కాదు. ముఖ్యంగా విద్యాసంస్థల్లో ఇది ఎంతమాత్రం హర్షణీయం కాదు. కానీ ఐఐటీ బాంబే లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో వెజ్-నాన్ వెజ్ వివాదం రాజుకుంది.

పాక్ వెళ్లిన అంజు వ్యవహారంలో ఊహించని ట్విస్టులు
ByBalaMurali Krishna

ఈ మధ్య కాలంలో ప్రేమికులు సరిహద్దులు దాటి మరి ప్రేమించుకోవడం ఎక్కువైపోతుంది. పాకిస్తాన్ దేశం నుంచి సిమ్రా, ఇండియా నుంచి అంజూ, శ్రీలంక నుంచి విఘ్నేశ్వరి.. ఇలా కుటుంబాలను వదిలేసి దేశాలు దాటి మరి ప్రేమించిన వారి కోసం వచ్చేస్తున్నారు. అయితే ఇలా వచ్చిన వారిలో కేవలం మహిళలే ఉండటం గమనార్హం.

ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ సూపర్ విక్టరీ
ByBalaMurali Krishna

తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ ఘన విజయం సాధించింది. ప్రొడ్యూసర్ల సెక్టార్లలోని 12స్థానాల్లో దిల్ రాజు ప్యానల్‌కు చెందిన ఏడుగురు గెలిచారు. గతంలో లేని విధంగా ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిందని ఎన్నికల అధికారి తెలిపారు. అధ్యక్ష పదవి కోసం దిల్‌రాజు, సి.కల్యాణ్ పోటీ పడ్డారు.

మాజీ మంత్రి నారాయణ మరదలు వీడియోల వ్యవహారంలో ఊహించని ట్విస్టులు
ByBalaMurali Krishna

మాజీ మంత్రి నారాయణపై ఆయన మరదలు ప్రియ విడుదల చేసిన వీడియోలు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. నారాయణపై ఆమె ఫిర్యాదుచేయడం.. ఆమెకు పిచ్చి అంటూ భర్త సుబ్రహ్మణ్యం వీడియో రిలీజ్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Advertisment
తాజా కథనాలు