మణిపూర్ అంశంపై మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వం చర్చ చేపడుతుందని రాజ్యసభలో మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు. దూధ్ కా దూధ్..పానీకా పానీ.. అని ఆయన వ్యాఖ్యానించారు. మణిపూర్ పరిస్థితిపై చర్చకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదన్నారు. ఇప్పటికే మీరు 9 రోజులుగా సభా కార్యకలాపాలను స్తంభింపజేశారన్నారు. 267 నిబంధన కింద చర్చ జరగాలని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. విపక్షాల తీరుపై మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడుతూ, మీరు ఏ అంశంపై చర్చ చేపట్టదలచినా అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాంటప్పుడు పార్లమెంటు సజావుగా నడిచేందుకు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. పదేపదే ముఖ్యమైన బిల్లుల ఆమోదానికి అడ్డుపడడం తగదని హితవు పలికారు.
పూర్తిగా చదవండి..మణిపూర్ అంశంపై దద్దరిల్లిన పార్లమెంట్.. లోక్సభ వాయిదా
మణిపూర్ అంశంపై విపక్షాలు ఎప్పటిలాగే పార్లమెంట్ ఉభయ సభలనూ స్తంభింపజేశాయి. సోమవారం ఉదయం 11 గంటలకు సభ సమావేశం కాగానే ప్రతిపక్ష ఎంపీలు.. దీనిపై వెంటనే చర్చ చేపట్టాలని, ప్రధాని మోదీ ప్రకటన చేయాలని నినాదాలు చేశారు. ముఖ్యమైన బిల్లులు పెండింగులో ఉన్నాయని, వీటిపై చర్చించాలన్న లోక్ సభ స్పీకర్ సూచనను వారు పట్టించుకోలేదు. వారి రభసతో సభ మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా పడింది.

Translate this News: