ఏలూరు వన్ టౌన్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. గత ఏడాది అత్యవసరంగా డబ్బులు అవసరమై ఏలూరుకు చెందిన తన స్నేహితుడు కార్తీక్ నుండి కొంత డబ్బులు తీసుకున్నాడు. రెండు నెలల క్రితం వడ్డీతో సహా చెల్లించాడు. అప్పుడే ప్రవీణ్కు పెళ్లి కుదరడంతో ఆ హడావిడిలో ల్యాప్ టాప్ తరువాత తీసుకుంటా అంటూ స్నేహితుడికి చెప్పాడు. గత నెల తన ఉద్యోగరీత్యా ల్యాప్ టాప్ అత్యవసరం కావడంతో తనకు ఇవ్వాలని కోరాడు. మొదట్లో ఇదిగో అదిగో ఇస్తానని నమ్మబలికాడు. మూడు రోజుల తరువాత కార్తీక్ నుంచి ఎటువంటి సమాధానం లేకపోవటంతో హైదరాబాద్లోని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు..
పూర్తిగా చదవండి..పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుడిపైనే థర్డ్ డిగ్రీ?
చట్టం ఇచ్చిన ప్రత్యేక అధికారంతో కొంతమంది పోలీసులు రెచ్చిపోతున్నారు. చట్టాలను చుట్టాలుగా చేసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి రక్షకభటులతో పోలీస్ వ్యవస్థకు చెడ్డపేరు వస్తుంది. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్కు వచ్చిన భాదితుడిపైనే ధర్డ్ డిగ్రీ చేసిన ఘటన ఏలూరు పట్టణంలో జరిగింది.
Translate this News: