Pawan Kalyan: మరో అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పి. గన్నవరం సీటును జనసేనకు కేటాయించారు. తాజాగా జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ పేరును ప్రకటించారు పవన్. తోలి జాబితాలో పి. గన్నవరం టికెట్ను రాజేష్కు చంద్రబాబు ఇచ్చిన విషయం తెలిసిందే. By V.J Reddy 23 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Janasena Chief Pawan Kalyan: ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది. ఆ స్థానంలో జనసేన పోటీ చేయనుంది. తాజాగా పి. గన్నవరంలో పోటీ చేసే జనసేన అభ్యర్థిని ప్రకటించారు పవన్ కళ్యాణ్. గిడ్డి సత్యనారాయణ పేరును ప్రకటించారు. రెండు నెలల కిందట జనసేనలో చేరారు గిడ్డి సత్యనారాయణ. ఇటీవల తోలి జాబితాలో పి. గన్నవరం టికెట్ ను రాజేష్ కు కేటాయించారు చంద్రబాబు. రాజేష్ పై స్థానికంలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆ సీటును జనసేనకు కేటాయించారు. పోలవరం కూడా జనసేనదే.. టీడీపీ-జనసేన-బీజేపీ మూడు పార్టీల పొత్తులో భాగం గా పోలవరం లో జనసేన పోటీ చేయనుంది. తాజాగా పోలవరం జనసేన అభ్యర్థిని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పోలవరం జనసేన అభ్యర్థి గా చిర్రి బాలరాజు కు టికెట్ కేటాయించారు. పవన్ ఆశీస్సులతో పోటీ సిద్ధమయ్యారు బాలరాజు. బాలరాజు కి సీటు కేటాయించడం పై పోలవరం నియోజకవర్గంలో సంబరాలు ఆకాశాన్ని తాకాయి. ALSO READ: ఏపీ గవర్నర్కు అస్వస్థత #chandrababu #tdp #janasena #pawan-kalyan #ap-elections-2024 #ycp #cm-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి