CM Jagan: చంద్రబాబు అరెస్ట్ మీద ఏపీ సీఏం జగన్ కీలక సమావేశం

లండన్ పర్యటన ముగించుకుని ఏపీ సీఎం జగన్ దంపతులు రాష్ట్రానికి వచ్చారు. ఈరోజు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై జగన్ సమీక్ష చేయనున్నారు. దాంతో పాటూ వైసీపీ ముఖ్యనేతలతో కూడా ఆయన భేటీ అవుతారు. రేపు జగన్ ఢిల్లీ వెళ్ళనున్నారు.

New Update
CM Jagan: చంద్రబాబు అరెస్ట్ మీద ఏపీ సీఏం జగన్ కీలక సమావేశం

CM Jagan Meeting with YCP leaders: లండన్ పర్యటన ముగించుకుని ఆంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు ఈరోజు తెల్లవారుఝామున రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ దగ్గర జగన్ కు ఘన స్వాగతం లభించింది. సీఎస్, మంత్రులు, డీజీపీ ఆయనకు స్వాగంత పలికారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆంధ్రాలో పరిస్థితులు చాలా మారాయి. వాటి పరిణామాలు, శాంతి భద్రతల మీద జగన్ ఈరోజు సమీక్ష చేయనున్నారు. దాని తర్వాత వైసీపీ ముఖ్య నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) అయిన దగ్గర నుంచీ జగన్ రాష్ట్రంలో లేరు. అందుకే ఈరోజు జరగనున్న జగన్‌ భేటీపై ఉత్కంఠ నెలకొంది. ఇందులో ముఖ్యమంత్రి ఏం నిర్ణయాలు తీసుకుంటారో అని అందరూ ఎదురు చూస్తున్నారు.

ఇక సీఎం జగన్మోహన్ రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు. అక్కడ కేంద్రమంత్రులతో జగన్ భేటీ అవుతారని తెలుస్తోంది.

ప్రధాని మోదీ (Modi), అమిత్‌షాల (Amit Shah) ను కూడా సీఎం కలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులపై కేంద్రమంత్రులతోనూ, మోదీ, అమిత్ షాలతోనూ చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
పార్లమెంట్ సమావేశాల్లో కీలక బిల్లుల ఆమోదానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్‌ను ఢిల్లీకి రావాలని కేంద్ర ప్రభుత్వం ముందే కోరింది. అయితే విదేశీ పర్యటనలో ఉండడంతో సెప్టెంబర్ 13న వస్తానని జగన్ వారికి ముందే చెప్పారు. ఇప్పుడు
చంద్రబాబు అరెస్టు తర్వాత జగన్ ఢిల్లీ టూర్‌ వెళుతుండడంపై ఆ విషయంలో కూడా ఉత్కంఠత నెలకొంది. మోదీ, అమిత్‌షాతో మీటింగ్‌లో బిల్లులుతో పాటూ, చంద్రబాబు అరెస్టు చర్చకు వచ్చే అవకాశం ఉండడంతో వారు ఏం మాట్లాడుకుంటారో, ఏం నిర్ణయాలు తీసుకుంటారో అని అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

Also Read: మార్నింగ్ యోగా, వాకింగ్ చేసిన చంద్రబాబు…నేడు లోకేశ్, బ్రహ్మణి కలిసే ఛాన్స్..!!

Advertisment
తాజా కథనాలు