🔴Live News Updates: పౌరులకు ఆయుధాలు.. ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మహానాడు వేదికగా టీడీపీ నేతలు అధికారికంగా ప్రకటించారు. 1995లో చంద్రబాబు తొలిసారిగా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి 30 ఏళ్లుగా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
పొన్నూరు ఎమ్మెల్యే దూలిపాళ్ల నరేంద్ర మహానాడులో సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని అధినేత చంద్రబాబును రిక్వెస్ట్ చేశారు.
కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు సభ ప్రారంభమైంది. ఈ సభకు టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జిల్లాల నుంచి భారీగా నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐతో రూపొందించిన ఎన్టీఆర్ ప్రసంగం వీడియో ప్రజంటేషన్ అందరినీ ఆకట్టుకుంటోంది.
AP నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025(APNCET) నోటిఫికేషన్ రిలీజైంది. 2025-26 విద్యా సంవత్సరంలో నాలుగేళ్ల బిఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం కానుంది.
గోదావరి నడిలో స్నానానికి దిగి గల్లంతైన ముగ్గురిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ప్రవీణ్(15), సూర్యతేజ(12) మృతదేహాలు దొరికాయి. పౌల్కుమార్(15) కోసం గాలింపు చేపట్టారు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకై ఏపీ సర్కార్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 1620 పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 13 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా.. జూన్ 2 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరం టౌన్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లైన మరుసటి రోజే పెళ్లికూతురు తన ప్రియుడితో పారిపోయింది. దాదాపు 50 గ్రాముల బంగారు ఆభరణాలు, పెళ్ళికొడుకు మొబైల్తో జంప్ అయిపోయింది. ఈ ఘటనతో సత్యసాయి జిల్లా హాట్ టాపిగా మారింది.