/rtv/media/media_files/2026/02/25/andhra-pradesh-2026-02-25-21-58-46.jpg)
Andhra Pradesh
ఏపీలో 26 మంది ఆర్డీవోలు ట్రాన్స్ఫర్ అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టులో దాఖలైన రిట్ అప్పీల్ తీర్పును అనుసరించి ఈ బదిలీ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి పోస్టింగ్ల కోసం GADలో రిపోర్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలాఉండగా 2018 బ్యాచ్కు చెందిన 25 మంది డీఎస్పీలను బదిలీ చేశారు. చీఫ్ ఆఫీస్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
వివిధ కీలక సబ్ డివిజన్లలో గ్రూప్-1 అధికారులు ఇప్పటికీ ప్రొహిబిషన్లోనే ఉన్నారు. 2018 రిక్రూట్మెంట్ లోపాలపై విచారణ పూర్తయ్యేవరకు.. అప్రాధాన్య పొస్టుల్లో ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Follow Us