/rtv/media/media_files/2025/08/14/counting-2025-08-14-08-58-28.jpg)
తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ జరుగుతోంది. ఒకే రౌండ్లో పులివెందుల ZPTC కౌంటింగ్, మూడు రౌండ్లలో ఒంటిమిట్ట ZPTC కౌంటింగ్ పూర్తికానుంది. మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడనున్నాయి. పులివెందులలో మొత్తం ఓట్లు 10,601 కాగా 9066 ఓట్లు పోలయ్యాయి. ఒంటిమిట్టలో మొత్తం ఓట్లు 24,606 కాగా20,681 ఓట్లు పోలయ్యాయి. పులివెందుల ఫలితంపై జనాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
పులివెందులలో టెన్షన్ టెన్షన్..
— 🦁 (@TEAM_CBN1) August 14, 2025
నేడే పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉప ఎన్నిక కౌంటింగ్..
ఉద్రిక్తతల నేపథ్యంలో భారీగా పోలీసుల మోహరింపు.
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కౌంటింగ్..మధ్యాహ్నం వరకు వెలువడనున్న ఫలితాలు..
పులివెందుల ఫలితంపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ.
పులివెందుల ఉప ఎన్నికలో
పులివెందుల ఉప ఎన్నిక కౌంటింగ్ను 10 టేబుళ్లపై ఒక రౌండ్లో నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్ట ఉప ఎన్నిక కౌంటింగ్ను 10 టేబుళ్లపై సుమారు 3 రౌండ్లలో లెక్కించనున్నారు. ఒక్కో టేబుల్కు ఒక సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు చొప్పున ఉన్నారు. సూపర్వైజర్లు 30 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లు 60 మంది, అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ముగ్గురు, తదితర సిబ్బంది కలిపి దాదాపు 100 మంది విధుల్లో ఉన్నారు. పులివెందుల ఉప ఎన్నికలో 74 శాతం ఓటింగ్, ఒంటిమిట్టలో 86 శాతం ఓటింగ్ నమోదైంది.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఉప ఎన్నికలు
పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలను ఏపీలోని కూటమి, వైసీపీ పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. పులివెందుల మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం కావడంతో వైసీపీకి ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ నియోజకవర్గంలో గడచిన మూడు దశాబ్ధాలుగా ఏనాడు ఎన్నికలు జరగలేదు. ప్రతిసారి ఏకగ్రీవంగానే ఎన్నికలు జరుగుతున్నాయి, అయితే ఈసారి రాష్ర్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ స్థానాన్ని ఎలాగైన గెలుచుకోవాలని నిర్ణయించింది. దీంతో టీడీపీ నియోజక వర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డికి టికెట్ కేటాయించింది. ఇక వైసీపీ నుంచి దివంగత జడ్పీటీసీ మహేశ్వర రెడ్డి కుమారుడు హేమంత్ రెడ్డి బరిలో నిలిచారు. పులివెందులలో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, మారెడ్డి లతారెడ్డి, హేమంత్రెడ్డి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్లో టీడీపీ అరాచకాలకు పాల్పడిందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో మొదటిసారి పులివెందులలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ ప్రకటించింది.