వైసీపీకి బిగ్ షాక్.. ఆన్‌లైన్ బెట్టింగ్ విషయంలో కీలక నేతపై కేసు

ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వైసీపీ నేత యడ్ల తాతాజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్, వైజాగ్‌లను కేంద్రంగా చేసుకుని ఆన్‌లైన్ బెట్టింగ్‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో తాతాజీతో పాటు నాగేశ్వరరావు, వెంకటరావు, మురళీపై కేసు నమోదు చేశారు.

New Update
Yadla Tataji

Yadla Tataji

ప్రస్తుతం రోజుల్లో బెట్టింగ్ యాప్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందరో యువకులు ఈ బెట్టింగ్ యాప్‌లకు బానిసై ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఆన్‌లైన్ వేదికగా క్రికెట్ బెట్టింగ్‌లను నిర్వహిస్తున్న వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. డీసీఎంఎస్‌ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత యడ్ల తాతాజీతో పాటు, ఆయన సోదరుడు నాగేశ్వరరావుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వీరితో పాటు వెంకటరావు, మురళీ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నగరాలను కేంద్రంగా చేసుకుని ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.

ఇది కూడా చూడండి: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్

బెట్టింగ్ నిర్వహిస్తుండగా..

వీరిని పాలకొల్లు పట్టణ సమీపంలో ఓ ప్రైవేట్ భవనంలో ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా దాడి చేశారు. వీరిలో ఇద్దరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారంతా పరారీలో ఉన్నారు. వీరి నుంచి రెండు ల్యాప్‌టాప్‌లు, పది సెల్‌ఫోన్లు, రూ.33 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వైసీపీ నేత యడ్ల తాతాజీ, నాగేశ్వరరావు గత పదేళ్లుగా బెట్టింగ్‌ రాకెట్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 

ఇది కూడా చూడండి: Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ వీడియో

ఇదిలా ఉండగా ఇటీవల ఖమ్మం జిల్లాలో ఫైనాన్స్ కంపెనీ వేధింపులు భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బోనకల్ మండలం గోవిందాపురంలో ఓ రైతు రెండేళ్ల క్రితం L&T ఫైనాన్స్ కంపెనీలో లోన్ తీసుకున్నాడు. అయితే ఈ డబ్బులతో వ్యవసాయ పనులు కోసం ట్రాక్టర్‌ను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో గత రెండు నెలల నుంచి ఈఎంఐ చెల్లించలేకపోయాడు. దీంతో ఫైనాన్స్ కంపెనీ వాళ్లు ఇంటికి వచ్చి గొడవపడ్డారు.

ఇది కూడా చూడండి: Telangana: తెలంగాణలో ద్రోణి ప్రభావం... మరో 2 రోజులు వానలు.. పిడుగులు!

 

కాస్త సమయం కావాలని రైతు కోరినా కూడా కనికరించలేదు. కుటుంబాన్ని బజారులోకి లాగుతామని బెదిరించారు. దీంతో ఆ రైతు పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లినా కూడా ప్రయోజనం లేకపోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రైతు మృతి చెందాడు. దీంతో బోనకల్ పీఎస్‌లో L&T ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులపై కేసు నమోదు చేశారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: మాజీ డీజీపీని దారుణ హత్య చేసిన భార్య..!

Advertisment
Advertisment
తాజా కథనాలు