Andhra Pradesh: ఉన్నత పాఠశాలల సమయం గంట పెంపు!
రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ క్యాలెండర్ లో సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్నితప్పనిసరి చేసింది.
రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అకడమిక్ క్యాలెండర్ లో సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయాన్నితప్పనిసరి చేసింది.
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ను ఈసీ రద్దు చేసింది. వైసీపీకి అక్కడ గెలపు కోసం కావాల్సిన సభ్యులు ఉన్నారు. దీంతో అక్కడ గెలిచి మండలిలో సభ్యుల బలం పెంచుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న ఆ పార్టీ అధినేత జగన్కు షాక్ తగిలింది.
యూట్యూబ్ చూసి నేర్చుకుని దొంగ నోట్లు తయారు చేసే ముఠాను పుత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన ఓ వ్యక్తి తన భర్యా, కూతురు, స్నేహితుడితో కలిసి ఇంట్లోనే దొంగ నోట్లను తయారు చేస్తున్నాడు. దాదాపు రూ.10 లక్షల వరకు దొంగ నోట్లు తయారు చేశాడు.
ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. సోమవారం, మంగళవారం నాటికి ఈ ఆవర్తనం.. అల్పపీడనంగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న రఘురాజుపై అనర్హత వేటు చెల్లదని ఏపీ హైకోర్టు తీర్పు నిచ్చింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నికలకు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికలను ఈసీ రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
AP: ఈరోజు సీఎం చంద్రబాబు విజయనగరం పర్యటన రద్దయింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో సీఎం పర్యటన రద్దు అయినట్లు ప్రకటన విడుదలైంది. విజయనగరం పర్యటన రద్దు కావడంతో ఈరోజు అనకాపల్లి, విశాఖ జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.
విజయనగరం స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28న విజయనగరం జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఈ నెల 4 నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ, 12న పరిశీలన ఉండనుంది. రఘురాజుపై అనర్హత వేటుతో ఈ ఎన్నిక అనివార్యం అయింది.
AP: మాజీ సీఎం జగన్ ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. గుర్లలో డయేరియా సోకి మృతి చెందిన కుటుంబాలను, బాధితులను పరామర్శించనున్నారు. కాగా నిన్న గుంటూరులో సహన కుటుంబ సభ్యులను, బద్వేల్లో అత్యాచారానికి గురైన అమ్మాయి కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు.
దానా తుపాను దూసుకొస్తోంది. వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఏపీలో ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ తుపాను కారణంగా సికింద్రాబాద్, హైదరాబాద్, భువనేశ్వర్, చెన్నై తదితర ప్రాంతాలకు వెళ్లే మొత్తం 37 రైళ్లను రద్దు చేసింది ఇండియన్ రైల్వే.