/rtv/media/media_files/2025/02/18/4rq4prfTGiMLUZbAFZXZ.jpg)
Vallabhaneni Vamsi
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో వంశీని పోలీసులు విజయవాడ సబ్ జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. బ్యాక్ పెయిన్, కాళ్లు వాయడంతో వెంటనే విజయవాడ ఆసుపత్రికి జైలు అధికారులు తీసుకెళ్లారు. కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసులో వంశీని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఇది కూడా చూడండి: Hyderabad Theft Incident: హైదరాబాద్ లో దొంగల బీభత్సం.. అద్దె కోసం వచ్చి ఇళ్లు గుల్ల..!
గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 143, 147, 148, 435, 506 రెడ్విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) కింద కేసులు నమోదు చేశారు. ఇందులో వంశీ అనుచరులపై కూడా కేసు నమోదైంది.
ఇది కూడా చూడండి: Hyderabad School Buses: డేంజర్ జోన్లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!
కార్యాలయ ఫర్నిచర్ను ధ్వంసం చేయడమే కాకుండా అక్కడే ఉన్న కొంతమంది టీడీపీ నేతలపై దాడి చేసి వాహనాలను తగులబెట్టినట్టుగా వారిపై కేసు నమోదైంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దాడి వెనుక వల్లభనేని వంశీ కుట్ర ఉందని పోలీసరులు అనుమానించి నిందితుడిగా చేర్చారు.
ఇది కూడా చూడండి: Revanth Reddy: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?
రిమాండ్ ఖైౌదీగా..
ఇదిలా ఉండగా వల్లభనేని వంశీపై మరో కేసు కూడా ఉంది. భూమిని కొనుగోలు చేసేందుకు మహిళతో అగ్రిమెంట్ చేసుకున్నానని శ్రీధర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా రాము, వల్లభనేని వంశీ, రంగా మరొకరిపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వంశీ ఏ2గా ఉన్నారు. అయితే వంశీని కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ను కిడ్నాప్ కేసు విషయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఇది కూడా చూడండి:Pending Traffic Challan: రూల్స్ మాకేనా, మీకు లేవా? పోలీస్ వాహనాలపై రూ.68 లక్షల చలాన్లు