Divvala Madhuri: దివ్వెల మాధురికి బిగ్ షాక్.. మరోసారి నోటీసులు పంపిన టీటీడీ!

వైసీపీ మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి టీటీడీ మరోసారి నోటీసులు పంపింది. తాజాగా వీరు తిరుపతి వెళ్లగా దర్శనం తర్వాత వారు బస చేసిన అతిథిగృహం వద్ద మాధురి లంగావోణీలో రీల్స్ చేశారు. ఈ క్రమంలో టీటీడీ మరోసారి నోటీసులు పంపింది.

New Update
divvela madhuri reel video

divvela madhuri reel video

Divvala Madhuri: పవిత్రమైన తిరుమల ఆలయంలో రీల్స్ వంటివి చేయడంతో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి టీటీడీ మరోసారి నోటీసులు పంపింది. తాజాగా వీరు తిరుపతి(Tirupathi) వెళ్లగా దర్శనం తర్వాత వారు బస చేసిన అతిథిగృహం వద్ద మాధురి లంగావోణీలో రీల్స్ చేశారు. కొండపై ఇలా రీల్స్ చేయడం ఏంటని కొందరు భక్తులు మండిపడ్డారు. ఆధ్యాత్మిక ప్రాంతమైన తిరుమల కొండపై ఇలా రీల్స్ చేసి వాతావరణాన్ని దెబ్బ తీశారని భక్తులు విమర్శిస్తున్నారు.

ఇది కూడా చూడండి: Sexual Harassment : ఉద్యోగం ఆశ జూపి అత్యాచారం..పద్మ అవార్డు గ్రహీతపై ఆరోపణలు

గతంలో కూడా ఒకసారి..

ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం దివ్వెల మాధురికి నోటీసులు పంపింది. ఇదిలా ఉండగా గతంలో కూడా దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ తిరుమలలోని ఆలయ పరిసరాల్లో రీల్స్ చేయడంతో నోటీసులు పంపారు. తిరుమల మాడ వీధుల్లో రీల్స్ చేయడంతో బీఎన్ఎస్ సెక్షన్లు 292, 296, 300, సెక్షన్ 66-200-2008 కింద కేసు నమోదు చేశారు.

ఇది కూడా చూడండి: Shefali Jariwala: గుండె పోటు కాదు.. షఫాలీ పోస్ట్‌మార్టంలో బయటపడ్డ సంచలనాలు!

ఇది కూడా చూడండి: MLC Kavita : దూకుడు పెంచిన కవిత..నిన్న కేంద్రమంత్రి, నేడు సీపీఐ ఎంపీతో భేటీ

 

Advertisment
Advertisment
తాజా కథనాలు