Explosives Case : వైసీపీకి షాక్‌..పేలుడు పదార్థాల నిల్వ కేసులో వైసీపీ నేత అరెస్ట్

అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వచేసిన వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ.20 లక్షల విలువైన జిలిటెన్‌ స్టిక్స్, డిటోనేటర్లు, ఇతర సామగ్రి, ఓ వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో వైసీపీ నేత దాసం హనుమంతరావుతో పాటు మరొకరిని అరెస్ట్‌ చేశారు.

New Update
Explosives Case

Explosives Case

Explosives Case : అక్రమంగా పేలుడు పదార్థాలను నిల్వచేసిన వైసీపీ నేతను పోలీసులు అరెస్టు చేశారు. సుమారు రూ.20 లక్షల విలువైన జిలిటెన్‌ స్టిక్స్, డిటోనేటర్లు, ఇతర సామగ్రి, ఓ వాహనం స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లి పంచాయతీ పరిధిలో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను అక్రమంగా నిల్వ ఉంచిన కేసులో వైసీపీ నేత దాసం హనుమంతరావుతో పాటు మరొకరిని అరెస్ట్‌ చేశారు. బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్టూరు మండలం నాగరాజుపల్లిలో పొలాల్లో ఉన్న ఓ గోదామును  దాసం హనుమంతరావు కొన్నేళ్లుగా సబ్‌ లీజుకు తీసుకొని అందులో పేలుడు పదార్థాలు నిల్వ చేస్తున్నారు. నిజానికి పేలుడు పదార్థాల నిల్వకు హనుమంతరావు గతంలో అనుమతి తీసుకున్నప్పటికీ అది గతనెల 31న ముగిసింది. అయినప్పటికీ పేలుడు పదార్థాల నిల్వను కొనసాగిస్తూ వస్తున్నాడు.

Also Read:  Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు!


కాగా తెలంగాణ రాష్ట్రం మేడ్చల్‌ జిల్లా కేంద్రంగా బిల్లులు లేకుండా పేలుడు పదార్ధాలు విక్రయిస్తున్న సాల్వో ఇండస్ట్రీ్‌స్‌ నుంచి ఈనెల 19న అక్రమంగా పేలుడు పదార్థాలు తీసుకొచ్చినట్లు పోలీసులకు తెలిసింది.దీంతో రైడ్‌ చేయగా  క్వారీల్లో పేలుళ్లకు ఉపయోగించే 5,000 కేజీల పేలుడు పదార్ధాలు, 2,300 ఈడీలు లభ్యమయ్యాయి.  అక్కడే ఉన్న నిందితుడు హనుమంతరావునూ అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ చేయాలని జిల్లా ఎస్పీని హోంమంత్రి అనిత ఆదేశించారు. గత ప్రభుత్వంలో జరిగిన పేలుళ్ల ఘటనలతో ఏళ్ల తరబడి ఇదే వ్యాపారంలో ఉన్న వైసీపీ నేత సహకారం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాలన్నారు. హనుమంతరావుతోపాటు దాసం వీరాంజనేయులు, నాగండ్ల ప్రసన్న, బత్తుల సాంబశివరావు, ప్రతాప్‌రెడ్డి, సాల్వో పరిశ్రమపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. 

Also Read: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్

విచారణకు హోంమంత్రి ఆదేశం 


మార్టూరు, బల్లికురవ ప్రాంతాల్లో వైకాపా నేతలు కొందరు అక్రమంగా పేలుడు పదార్థాలు కలిగి ఉన్నారన్న దానిపై హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు. గ్రానైట్‌ వ్యాపారం ముసుగులో జిలిటెన్‌ స్టిక్స్‌ టన్నుల కొద్దీ తరలిస్తున్నట్లు వెలుగుచూడటంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Also Read: Pavani Reddy : మొదటి భర్త ఆత్మహత్య.. రెండో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ!

Also Read: Prakasam: క్రికెట్ గ్రౌండ్‌లో పిడుగుపాటు.. చెట్టుకిందికెళ్లిన ఇద్దరు బాలురు మృతి

Advertisment
Advertisment
తాజా కథనాలు