జూన్ 20న ఏపీలో ప్రధాని పర్యటన.. షెడ్యూల్ ఇదే!

ప్రధాని మోడీ జూన్ 20న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకొని రాత్రికి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. జూన్ 21న ఉదయం 6.30 నుంచి 7.45 వరకు విశాఖ RKబీచ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు.

New Update
PM Modi

PM Modi

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 20న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకొని ఆ రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్ల చేస్తున్నారు.

ఈ పర్యటనలో భాగంగా మోడీ జూన్ 21న ఉదయం 6.30 గంటల నుంచి 7.45 వరకు విశాఖ ఆర్కే బీచ్‌లో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే యోగా డే సందర్భంగా విశాఖ బీచ్ వేదికగా ఈ వేడుక ఎంతో ఘనంగా నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఉదయం 11.50 గంటలకు దిల్లీకి తిరుగు పయనమవుతారని సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు