/rtv/media/media_files/2025/05/16/ZS08Xw8ioRztzg1vmKtY.jpg)
PM Modi
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 20న విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకొని ఆ రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో ఆయన బస చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులు ఇప్పటికే భారీ ఏర్పాట్ల చేస్తున్నారు.
ఈ నెల 21న విశాఖకు ప్రధాని మోదీ.
— greatandhra (@greatandhranews) June 15, 2025
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్న మోదీ.
ఈ నెల 21న ఉ.6:30 నుంచి 7:45 వరకు ఆర్కే బీచ్ రోడ్లో యోగా డే వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని @narendramodi#InternationalDayofYoga2025
(File Pic) pic.twitter.com/5udXiVhOkM
ఈ పర్యటనలో భాగంగా మోడీ జూన్ 21న ఉదయం 6.30 గంటల నుంచి 7.45 వరకు విశాఖ ఆర్కే బీచ్లో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే యోగా డే సందర్భంగా విశాఖ బీచ్ వేదికగా ఈ వేడుక ఎంతో ఘనంగా నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఉదయం 11.50 గంటలకు దిల్లీకి తిరుగు పయనమవుతారని సమాచారం.