AP: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే అంతే.. డీఎస్పీ హెచ్చరిక
నెల్లూరు జిల్లా గూడూరులోని అరుంధతియ వాడలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సరే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి.