/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/babu-3-1.jpg)
Ration Card: పండుగ వేళ ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెరిగిన నూనె ధరలతో ఇక్కట్లు పడుతున్న సామాన్యులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపులలో పామోలిన్ లీటరు (850 గ్రాములు) రూ.110, సన్ఫ్లవర్ ఆయిల్ లీటరు (910 గ్రాములు) రూ.124 చొప్పున విక్రయించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈ నెలాఖరు వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.
ఒక్కో రేషన్ కార్డుపై...
ఒక్కో రేషన్ కార్డుపై ఒక లీటర్ సన్ఫ్లవర్ నూనె, అలాగే మూడు లీటర్ల పామోలిన్ నిర్ణయించిన ధరలపై అందించనున్నట్లు చెప్పారు. పండుగ వేళ ప్రజలకు ఈ ధరలు ఇబ్బంది కావొద్దు అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిన్న విజయవాడలోని పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో వంటనూనెల సరఫరాదారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, వర్తక సంఘాల ప్రతినిధులతో ఆయన ధరల నియంత్రణపై చర్చించారు. రాష్ట్రమంతటా ఒకే రకంగా ధరలు ఉండాలని చూడాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.