/rtv/media/media_files/2025/05/05/3arCH01ZQ4Rg4Z9lcsUH.jpg)
NEET UG 2025
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత ఎంట్రన్స్ ఎగ్జామ్ (నీట్- యూజీ 2025) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్తో సహా మొత్తం 24 నగరాలు, పట్టణాలతో కలిపి 190 కేంద్రాల్లో పరీక్ష ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు మొత్తం 72,507 మంది దరఖాస్తు చేసుకోగా 69,977 మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీనిబట్టి ఎగ్జామ్ రాసిన వారి శాతం 96.51గా ఉంది.
Also Read : కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!
నీట్ పరీక్ష రాసిన 72 ఏళ్ల
ఇదిలా ఉంటే ఈ పరీక్ష సమయంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. 72 ఏళ్ల ఒక ముసలవ్వ ఈ నీట్ ఎగ్జామ్ రాయడం సంచలనంగా మారింది. అవును మీరు విన్నది నిజమే.. కాకినాడకు చెందిన ఒక వృద్ధురాలు ఈ వయసులో నీట్ పరీక్ష రాయడంతో అంతా షాక్ అవుతున్నారు. కాకినాడకు చెందిన పోతుల వెంకటలక్ష్మికి 72 ఏళ్లు. ఆమె ఈ వయసులో నీట్ ఎగ్జామ్ రాశారు.
Also Read : దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్
దీని కోసం ఆమె కాకినాడలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఆదివారం వెళ్లారు. అక్కడ పరీక్ష సమయం దగ్గపడటంతో తనిఖీ కేంద్రం వద్ద ఆధార్, హాల్టికెట్ను చూపించి పరీక్ష రాసేందుకు వెళ్లారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అది చూసి చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. చదువుకు వయసు అడ్డం కాదని ఆమె నిరూపించారని అంటున్నారు.
Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం
తల్లీ కూతురు రాసిన నీట్ పరీక్ష
అలాగే సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం మంచానాయక్ తండాకు చెందిన తల్లీకూతురు బానోత్ సరిత, బానోత్ కావేరి ఒకేసారి నీట్ ఎగ్జామ్ రాశారు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన పెద్ద కూతురితో కలిసి తల్లి కూడా నీట్ పరీక్ష రాసింది. ఇద్దరూ కలిసి ఖమ్మంలో ఒకే గదిలో ఉండి కోచింగ్ తీసుకున్నారు. అనంతరం తల్లి సరిత సూర్యాపేటలో పరీక్ష రాసింది. కూతురు కావేరి ఖమ్మంలో పరీక్ష రాసింది.
Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!
neet-exam | latest-telugu-news | telugu-news