/rtv/media/media_files/2025/05/26/VqBqboB4SkAGycDggjbM.jpg)
Peace Committee : ఈ నెల 21న ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు ప్రధానకార్యదర్శి నంబాళ్ల కేశవరావుతో పాటు పలువురు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. అయితే వారి మృతదేహాలను ఇంతవరకు వారి కుటుంబసభ్యులకు అప్పగించకపోవడాన్ని పీస్ కమిటీ తప్పు పట్టింది. వెంటనే వారి మృతదుహాలను వారి కుటుంబాలు, బంధువులకు అంజేయాలని పీస్ కో ఆర్టినేషన్ కమిటీ నుంచి ప్రొ.హరగోపాల్, ప్రొ.జి లక్ష్మణ్, డా. ఎం.ఎఫ్. గోపినాథ్, కవితా శ్రీవాత్సవ, క్రాంతి చైతన్య, మీనా కందసామి తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మృతుల గౌరవానికి సంబంధించిన రాజ్యాంగ, న్యాయపరమైన, అంతర్జాతీయ బాధ్యతలను పూర్తిగా అమలు చేయాలని చత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పత్రిక ప్రకటన విడుదల చేశారు.
ఇది కూడా చూడండి: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్లోనే (VIDEO)
ఎన్కౌంటర్ జరిగి ఐదు రోజులు కావోస్తున్నప్పటికీ వారి మృతదేహాలను కుటంబాలకు అప్పగించకపోవడం దారుణమని వారు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఛత్తీస్ గఢ్ అడ్వకేట్ జనరల్ మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసిన తర్వాత వారి కుటుంబీకులకు అప్పగిస్తామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు హామీ ఇచ్చారన్నారు. కానీ ఆయన మాట మీద నిలబడకుండా ఇప్పటి వరకు మృతదేహాలను అప్పగించలేదని పీస్ కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహాలతో గౌరవప్రదంగా వ్యవహరిచాలనే హక్కు ఉల్లంఘిస్తున్నారన్నారు.. గౌరవంగా భద్రపరచాలనే స్పష్టమైన చట్టపరమైన బాధ్యత ఉన్నప్పటికీ వాటిని కోల్డ్ స్టోరేజ్ లో భద్ర పర్చకుండా కుళ్లిపోయేలా వదిలేశారనే ఆరోపణలు ఆందోళన కలిగిస్తోందని పీస్ కమిటీ అభిప్రాయపడింది.
Also Read: దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే?
మరణించిన వ్యక్తితో అమానవీయంగా వ్యవహరించడం, విషాదంలో ఉన్న కుటుంబాలకు మరింత మానసిక ఆందోళనను కలిగించడమేనని పీస్ కమిటీ ఆరోపించింది. ఇలా వ్యవహరించడం వైద్య, చట్టపరమైన ప్రోటోకాల్ ను తీవ్రంగా ఉల్లంఘించడమేనని పీస్ కమిటీ పేర్కొనింది. అంత్యక్రియల ఊరేగింపుల వల్ల శాంతిభద్రతల సమస్య వస్తుందనడం, ఆ కారణంతో ఇద్దరు అగ్రనేతల మృతదేహాలను అప్పగించడాన్ని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వ్యతిరేకించడం బాధకలిగించే అంశమని పేర్కొన్నారు. సంతాపాన్ని నేరంగా పరిగణించే ఈ విధానం చాలా దుర్మార్గమైనదని.. రాజ్యాంగానికి వ్యతిరేకమని పీస్ కమిటీ ఆభిప్రాయపడింది. అంతిమ సంస్కారాలు చేయడానికి తాము ఎలాంటి షరతులకైనా కట్టుబడి ఉన్నామని మావోయిస్టు కుటుంబాలు కోర్టుకు తెలిపినా.. ఇంకా మృతదేహాలను వారికి అప్పగించకపోవడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పీస్ కమిటీ వెల్లడించింది.
Also Read: నీ అక్రమ సంబంధం సీక్రెట్ నీ భార్యకు చెబుతా.. ఇంజనీర్ను బ్లాక్ మెయిల్ చేసిన AI!