/rtv/media/media_files/2025/02/06/96PeaR0hKkht3gP21e1m.webp)
ACCIDENT
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొంది. ఈ విషాద ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు కూలీలు మృతి చెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మకూర్ క్రాస్రోడ్లోని పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులు వెంకట్రావుపల్లి గ్రామానికి చెందివాళ్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
Also Read: విషాదం.. ఇంజెక్షన్ వికటించి అయిదుగురు మృతి..
ఇదిలాఉండగా విజయవాడ-హైదరాబాద్ హైవేపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు.
Also Read: కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి, వరుడికి గాయాలు
వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురం వద్ద ఆగి ఒక లారీ ఆగి ఉంది. అయితే అదే రూట్లో వచ్చిన ట్రావెల్స్ బస్సు ఆ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా ఓ మహిళా ప్రయాణికురాలు స్పాట్లో ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆ లారీ మధ్యలో బ్రేక్డౌన్ అయింది. దీంతో డ్రైవర్ దాన్ని రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో ఆ రూట్లో హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి గట్టిగా డాష్ ఇవ్వడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
Also Read: కరోనా వైరస్.. ఇప్పుడు కొత్త ఫంగస్.. చైనా రోగాల ఫ్యాక్టరీ గురించి తెలుసా..?
telugu-news | rtv-news | raod-accident