Andhra Pradesh: ఏపీకి గుడ్‌న్యూస్.. అమరావతిలో మరో యూనివర్సిటీ

అమరావతిలో ప్రతిష్ఠాత్మక న్యాయ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ వర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్బిట్రేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు.

New Update
law university to Establish Soon in Amaravati under BCI Trust

law university to Establish Soon in Amaravati under BCI Trust

అమరావతిలో ప్రతిష్ఠాత్మక న్యాయ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI)కు చెందిన 'బీసీఐ ట్రస్ట్ పెర్ల్‌ ఫస్ట్' ఆధ్వర్యంలో 'ఇండియా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌' ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులిచ్చారు.   

Also Read: చిన్న దేశమైనా రష్యాని చిత్తు చేస్తున్న ఉక్రెయిన్.. వెనుక ఎవరున్నారో తెలిస్తే షాక్..!

ఇక అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో లా యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు బీసీఐ ట్రస్ట్‌ ఇటీవల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. బీసీఐ అధ్యక్షుడితో పాటు ఇతర కీలక సభ్యులు గవర్నర్‌ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడితో ఇప్పటికే వేరువేరుగా సమావేశమయ్యారు. అమరావతిలో బీసీఐ ఏర్పాటు చేయనున్న ఈ న్యాయ వర్సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్బిట్రేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. 

Also Read: విషాదం.. ఇంజెక్షన్‌ వికటించి అయిదుగురు మృతి..

అలాగే న్యాయ, అనుబంధ రంగాల్లో ఉన్నత విద్యావకాశాల కల్పనకు, స్కిల్స్‌ పెంచుకునేందుకు ఈ విశ్వవిద్యాలయం ఎంతగానో దోహదపడనుంది. బీసీఐ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బెంగళూరులో 1986లో నేషనల్ లా స్కూల్‌ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (NLSIU)ని ఏర్పాటు చేశారు. అలాగే గోవాలో ఇండియా ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లీగల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ ( IIULER)ను స్థాపించారు. ఈ రెండూ కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నాయి. 

Also Read: కరోనా వైరస్.. ఇప్పుడు కొత్త ఫంగస్.. చైనా రోగాల ఫ్యాక్టరీ గురించి తెలుసా..?

Also Read: 17 ఏళ్లకే హత్యకు గురైన ఈ సనా యూనఫ్‌ ఎవరు? ఆమె దేని కోసం ఫైట్ చేసింది?

 rtv-news | amaravathi | andhra-padesh

Advertisment
Advertisment
తాజా కథనాలు