BREAKING: నారాయణరెడ్డి హత్య కేసు.. 11 మందికి యావజ్జీవ శిక్ష

కర్నూలు మాజీ ఎమ్మెల్యే భర్త కంగాటి లక్ష్మీనారాయణరెడ్డి, అతని అనుచరుడు హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మొత్తం 11 మందికి యావజ్జీవ శిక్ష విధించింది. అలాగే ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 

New Update
V BREAKING

కర్నూలు జిల్లా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే భర్త అతని అనుచరుడు హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి భర్త, వైసీపీ నేత కంగాటి లక్ష్మీనారాయణరెడ్డి, అనుచరుడు బోయ సాంబశివుడిను హత్య చేసిన వారికి కోర్టు 11 మందికి యావజ్జీవ శిక్ష విధించింది. 2017లో కంగాటి నారాయణరెడ్డి వివాహానికి వెళ్లేందుకు రెండు వాహనాల్లో బయలుదేరారు.

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

నారాయణ రెడ్డిని నరికి..

ఈ సమయంలో కృష్ణగిరి రోడ్డులో దెబ్బతిన్న కల్వర్టు దగ్గర నిందితులు పక్క నుంచి రెండు ట్రాక్టర్లతో వచ్చి నారాయణరెడ్డి వాహనాన్ని ఢీకొట్టారు. మిగిలిన కొందరు నారాయణరెడ్డిని నరికి బాంబులు వేసి చంపారు. అలాగే అదే వాహనంలో ఉన్న సాంబశివుడిని కూడా  హత్యచేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొత్తం 19 మందిని నిందితులుగా దాఖలు చేశారు. వీరిలో 11 మందిని దోషులుగా కోర్టు తేల్చింది. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

 కురువ రామాంజనేయులు, రామానాయుడు, కురువ రామకృష్ణ, కోతుల బాలు, కోతుల చిన్నఎల్లప్ప, కోతుల పెద్దఎల్లప్ప, గంటల వెంకటరాముడు, గంటల శ్రీను, బీసన్నగారి రామాంజనేయులు, బీసన్నగారి రామాంజనేయులు, బీసన్నగారి పెద్దబీసన్నకు యావజ్జీవ కారాగార శిక్ష వేయడంతో పాటు ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 

ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు