Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్!
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించారు.
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించారు.
ఇవాళ ఒక్కరోజే ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. హైదరాబాద్-శ్రీశైలం హైవేపై ఒక కారు వేగంగా వచ్చి చెట్టును ఢికొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. కడప చెన్నై హైవేపై కారు-స్కూటర్ ఢీకొనడంతో ఇద్దరు మృతి.. జగిత్యాల సమీపంలో లగ్జరీబస్సు కారును ఢీకొట్టడంతో ఇద్దరుమృతి చెందారు.
AP: సజ్జల రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన కుమారుడు భార్గవ్ పై కేసు నమోదైంది. అధికార పార్టీ నేతలే టార్గెట్గా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలతో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ నెల 12, 13,14 తేదీల్లో ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు పడతాయని...భారీ నుంచి మోస్తరు వర్సాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల చేసేవారు, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వైసీపీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వంలో పోలీసులు పని చేస్తున్నారని కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు తప్పు చేస్తే చూస్తూ ఊరుకునే వారు ఎవరూ లేరన్నారు. పోలీసుల చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.
AP: కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పీఏను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. సోషల్ మీడియాలో అవినాష్ పీఏ రాఘవ రెడ్డి అసభ్యకరమైన పోస్టులు పెట్టడంతో అతన్ని అదుపులోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం అవినాష్ పీఏ పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఏపీని మరోసారి వరుణుడు పలకరించున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాగల 48 గంటల్లో ఈ ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయి.
AP: మోదీపై షర్మిల విమర్శలు చేశారు. మోదీ ఒక బీసీ అని అన్నారు. కానీ.. ఆయనకు బీసీలంటే ఓటింగ్ యంత్రాలు మాత్రమే అని అన్నారు. బీజేపీ పేదల పార్టీ కాదని.. అంబానీ, అదానీ, కార్పొరేట్ వాళ్లకు కొమ్ముగాసే పార్టీ అని ఫైర్ అయ్యారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకమన్నారు.
AP: పోలీసుల నుంచి తప్పించుకున్న వర్రా రవీంద్ర రెడ్డి ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత నడుమ అతన్ని కడపకు తరలిస్తున్నారు. కాగా గతంలో వైఎస్ భారతి వద్ద ఇతను పీఏగా పని చేసినట్లు ప్రచారం జరుగుతోంది.