Breaking: జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్!

జర్నలిస్ట్ కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ డిబేట్‌లో కృష్ణంరాజు అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. దీంతో శ్రీకాకుళం ప్రాంతంలో కృష్ణంరాజును అదుపులోకి తీసుకుని గుంటూరుకు తీసుకొస్తున్నారు.

New Update
Journalist Krishnam Raju arrested!

Journalist Krishnam Raju arrested!

Breaking:  జర్నలిస్ట్ కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీ డిబేట్‌లో కృష్ణంరాజు అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. దీంతో శ్రీకాకుళం ప్రాంతంలో  కృష్ణంరాజును అదుపులోకి తీసుకుని గుంటూరుకు తీసుకొస్తున్నారు. ఇదే కేసులో జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. గత కొన్ని రోజులుగా పరారీలో ఉన్న అతన్ని బుధవారం రాత్రి భీమిలి గోస్తనీనది సమీపంలో సెల్‌ టవర్‌ లోకేషన్‌ ఆధారంగా  పోలీసులు అరెస్ట్‌ చేశారు. కృష్ణంరాజు వెంట ఉన్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురినీ విశాఖ నుంచి విజయవాడ తీసుకొస్తున్నట్టు సమాచారం.

Also Read: సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్..వారి ఖాతాల్లోకి రూ.15 వేలు

అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్ట్‌ మ్యాగజైన్‌ ఎడిటర్‌ వీవీఆర్‌ కృష్ణంరాజు, సాక్షి టీవీ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేయగా.. మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. 

అమరావతి దేవతల రాజధాని కాదు. వేశ్యల రాజధాని.’’ అంటూ సాక్షి చానల్‌ చర్చలో జర్నలిస్టు వీవీఆర్‌ కృష్ణంరాజు తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డ మహిళలు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్‌ చేయగా కృష్ణం రాజు మాత్రం పోలీసులకు చిక్కకుండా ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందులో భాగంగా ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

Also Read: ఇండియాలో తగ్గుతున్న జనాభా..పెరుగుతున్న అవగాహన


నేను అన్న మాటలు నా సొంతం కావాని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాన్ని మాత్రమే డిబేట్‌లో ప్రస్తావించానని ఆయన పేర్కోన్నారు. ఈ క్రమంలో నన్ను అరెస్ట్‌ చేసేందుకు ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. అరెస్ట్‌ చేసి, చిత్రహింసలకు గురిచేస్తారనే ఆందోళన ఉందని కోర్టులో పిటిషన్‌ వేశారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు నాకు వర్తించవని ఆయన స్పష్టం చేశారు. దర్యాప్తునకు సహకరిచేందుకు సిద్ధంగా ఉన్నానని కనుక తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయండి.’’ అని పిటిషన్‌లో కోరారు. కాగా హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకమునుపే కృష్ణం రాజు పోలీసుల చేతికి చిక్కారు.

Also Read: సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్..వారి ఖాతాల్లోకి రూ.15 వేలు

Advertisment
Advertisment
తాజా కథనాలు