AP Government: ఏపీకి చెందిన ఆర్మీ కుటుంబాలకు కూటమి సర్కార్ శుభవార్త.. కొత్త స్కీమ్ ప్రకటన!

దేశ రక్షణలో తమదైన పాత్ర నిర్వహిస్తున్న సైనికుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దులో పనిచేస్తున్న ఆర్మీతో పాటు రక్షణ సిబ్బందికి రాష్ట్రంలోని పంచాయతీల్లో పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది.

New Update
Indian Army

Indian Army

BIG BREAKING:  దేశ రక్షణలో తమదైన పాత్ర నిర్వహిస్తున్న సైనికుల కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దులో పనిచేస్తున్న ఆర్మీతో పాటు రక్షణ సిబ్బందికి రాష్ట్రంలోని పంచాయతీల్లో పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. రక్షణ విధుల్లో ఉన్నవారితో పాటు, గతంలో సైన్యంలో పనిచేసి రిటైర్‌ అయినవారు, వారి జీవిత భాగస్వాముల పేరిట ఇల్లు ఉంటే వారికి ఇక మీదట ఆస్తి పన్ను ఉండదు.భారత్‌ పాకిస్థాన్‌ మధ్య యుద్ధ సాగుతున్న వేళ దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికుల కోసం ఏపీ ప్రభుత్వం ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఇది కూడా చూడండి: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

AP Good News For Indian Army Families

నిజానికి ఈ పథకం గతంలోనూ ఉన్నప్పటికీ  మాజీ సైనికులకు, విధుల్లో ఉన్న ఆర్మీ సిబ్బందికి మాత్రమే ఈ అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు విధుల్లో ఉన్న రక్షణ సిబ్బందికి కూడా ఈ సౌకర్యం వర్తించనుంది. ప్రస్తుతం తీసుకున్న ఈ నిర్ణయంతో మాజీ సైనికులు, విధుల్లో ఉన్న డిఫెన్స్‌ సిబ్బంది, వారి భార్యలేదా భర్తపేరుమీద ఇల్లు ఉన్నట్లయితే ఇక మీదట ఆస్తి పన్ను ఉండదని ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ విషయమై రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ గతంలో సైనికుల సంక్షేమాన్ని గుర్తు చేస్తూ ప్రభుత్వానికి లేఖ రాసింది. మాజీ సైనికులకు, ఆర్మీ సిబ్బందికి మాత్రమే ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల మిగతా రక్షణ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను లేఖ ద్వారా ప్రభుత్వానికి వివరించింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్రప్రభుత్వం 10 నవంబర్‌ 2003న జారీ చేసిన గతఉత్తర్వులను సవరించింది.

Also Read: మీ ఇళ్లను పేల్చేస్తాం.. పాకిస్తాన్ నుంచి తిరుపతికి ఫోన్ కాల్స్ కలకలం!

 గతంలో ఆర్మీ అనే పదం స్థానంలో డిఫెన్స్ అనే పదాన్ని చేర్చింది.ఈ ఉత్తర్వులతో మాజీ సైనికులు లేదా విధుల్లో ఉన్న రక్షణ సిబ్బంది, వారి జీవిత భాగస్వాముల్లో ఎవరికైనా ఒకరికే ఆస్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే భార్య, భర్తల పేర్ల మీద రెండు ఇళ్లు ఉన్నప్పటికీ ఒకరికి అంటే ఒక ఇంటికి మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది. అది కూడా ఎన్ని అంతస్తులు ఉన్నప్పటికీ ఒకే డోరు ఉంటే చాలు ఈ నిబంధన వర్తిస్తుంది. అయితే ఇ ఇంటిలో సంబంధిత రక్షణ సిబ్బంది కుటుంబ సభ్యులు మాత్రమే నివసిస్తూ ఉండాలి. అంతే కానీ దానిని అద్దెకు ఇస్తే పన్ను మినహాయింపు వర్తించదు.

ఇది కూడా చూడండి: IND PAK WAR 2025: జైసల్మేర్‌లో 70కి పైగా డ్రోన్లు, క్షిపణులు గాల్లోనే ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!

ఒక గ్రామ పంచాయతీలో ఉన్న ఇళ్లన్నింటిలో 10 శాతం కంటే ఎక్కువ ఇళ్లు రక్షణ సిబ్బందివి ఉన్నచోట ఆస్తి పన్నులో 50 శాతం మాత్రమే మినహాయింపు ఇస్తారు. 10 శాతం కంటే తక్కువ ఇళ్లు ఉంటే 100 శాతం మినహాయింపు వర్తిస్తుంది. కాగా ఈ నిర్ణయంపై సైనికులు, మాజీ సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 

ఇది కూడా చూడండి: FLASH NEWS: పాక్ ప్రధాని ఇంటి పక్కనే డ్రోన్ దాడి.. బంకర్‌లోకి తరలింపు

 

indian defense forces | defense | ap cm chandra babu naidu | ap-govt

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు