weather news : ఈ వేసవికాలంలో విభిన్నమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట ఎండలు మాడు పగలగొడుతుండగా రాత్రి పూట విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఏపీకి సంబంధించి విశాఖ వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న నాలుగు రోజల పాటు రాష్ర్టంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమలో రానున్ననాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 40-50 కిమీ వేగంతో గాలుల వీచే అవకాశం ఉందని వివరించింది. పంటలు వేసిన రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
Also Read: పాక్ను గాల్లోనే అబ్బ అనిపించాం.. వీడియోలు రిలీజ్ చేసిన ఇండియన్ ఆర్మీ!
ఇక తెలంగాణలో మాత్రం వాతావరణం అందుకు భిన్నంగా ఉండనుంది. రానున్న రోజుల్లో ఎండలు తీవ్రం కానున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. రానున్న రెండు రోజులు సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి గడచిన వారం రోజులుగా వాతావరణంలో కొంత మార్పు కనిపించింది. గత ఏడాదితో పోలిస్తే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. రాత్రి పూట వాతావరణం కొంత కూల్గా ఉంది. కానీ వచ్చే రోజుల్లో మాత్రం గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.
Also Read : మూడు పానీయాలు తాగితే కాలేయం కుళ్లిపోవడం ఖాయం..
ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతున్నప్పటికీ ఉక్కపోత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా దక్షిణాదిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో రానున్న రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. 17 మంది ఆడశిశువులకు సిందూర్ పేరు
Also Read : విరాట్ కోహ్లీ సంపద తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఇన్ని కోట్లా భయ్యా!