/rtv/media/media_files/2025/05/12/eBNuYyD9qgkOoF1bBlTh.jpg)
Pakistan Spy
భారత అర్మీకి సంబంధించిన రహస్యాలను పాకిస్థాన్కు లీక్ చేస్తున్న మరో ఇంటిదొంగ గుట్టు రట్టు చేశారు పోలీసులు. పాకిస్తాన్కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో పాటు ఖలిస్థానీ ఉగ్రవాది గోపాల్ సింగ్ చావ్లాతో సంబంధాలు కలిగి ఉన్న గగన్దీప్ సింగ్ అనే వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఆ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ మంగళవారం వివరించారు. గత అయిదేళ్లుగా పాకిస్తాన్లో ఉంటున్న గోపాల్ చావ్లాతో నిందితుడు నేరుగా సంప్రదింపులు జరపడంతో పాటు, అతని ద్వారా ఐఎస్ఐ గూఢచారులతో పరిచయాలు పెంచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read: HHVM Trailer: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మ.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేస్తుంది!
అతి సున్నితమైన భారత సైనిక కదలికలు, దళాల మోహరింపు, వ్యూహాత్మక ప్రాంతాల సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాక అతని వద్ద స్వాధీనం చేసుకున్న మొబైల్ లో 20 మందికి పైగా ఐఎస్ఐ విదేశీ కాంటాక్టుల సమాచారాం కూడా ఉన్నట్లు గుర్తించారు. ఆ ఫోన్లో పలు ముఖ్యమైన వివరాలు, భారత భద్రతా వ్యవస్థలకు సంబంధించిన సమాచారం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో గగన్ దీప్ సింగ్ పాకిస్తాన్ కు గూఢచారిగా పనిచేసినట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన చర్యల సమయంలో గగన్ దీప్ సింగ్ కీలక సమాచారం విదేశాలకు చేరవేశాడు.
Also Read: సెక్స్ వర్కర్లలో తెలుగు స్టేట్స్ టాప్.. HIV కేసుల్లో ఇండియా నెం3!
కాగా పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్ తో సంబంధాలున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో పాకిస్తాన్ మద్దతుతో పనిచేస్తున్న గూఢచార నెట్వర్క్పై ఫోకస్ పెట్టారు. హర్యానాకు చెందిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ జ్యోతి మల్హోత్రా, పంజాబ్కు చెందిన గుజాలా, ఓ సీఆర్పీఎఫ్ జవాన్ కూడా గూఢచార ఆరోపణలతో అరెస్ట్ అయ్యారు. తాజాగా గగన్దీప్ సింగ్కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, టెక్నికల్ డేటా పై విచారణ జరుపుతున్నారు. ఈ నెట్వర్క్లో ఇంకా ఎంత మంది ఉన్నారు. జాతీయ భద్రతా విషయాలను ఏ మేరకు పాకిస్థాన్ కు చేరవేశారనే వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Also Read: HHVM Trailer: పవన్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మ.. ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ వచ్చేస్తుంది!