/rtv/media/media_files/KAUQxm2DGco39vRLqA89.jpg)
AP government special focus on Illigal ganja transportation
Ganja: గంజాయి అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. ఒడిస్సా నుంచి అధికంగా గంజాయి రవాణా అవుతున్నట్లు గుర్తించిన పోలీసులు ఇంటర్ స్టేట్ గ్యాంగ్లపై నిఘా పెట్టారు. గంజాయిని అరికట్టేందుకు కొత్తగా ఈగల్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడి ఆయన.. ఏపీలో గంజాయి సాగు పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని చెప్పారు. రాష్ట్రం నుంచి గంజాయి రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాలను పట్టుకుంటున్నట్లు వెల్లడించారు.
రవాణా చేస్తున్న వారి ఆస్తులు సీజ్..
గంజాయి రవాణా చేస్తున్న వాళ్ళ ఆస్తులు సీజ్ చేస్తున్నాం. డ్రగ్స్, గంజాయి రవాణా చేసే వాళ్ళను హెచ్చరిస్తున్నాం. కాలేజీల వద్ద విక్రయిస్తున్న వారిని అరెస్టు చేస్తున్నాం. గంజాయి రవాణా, విక్రయించవద్దని ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. సెక్యూరిటీ ఎవరికి కావాలంటే వారికి ఇస్తున్నాం. గిరిజనులకు గంజాయి సాగు చేపట్టవద్దని అవగాహన కల్పిస్తున్నాం. ఇతర పంటల సాగుపై కూడా వారికి ట్రైనింగ్ ఇస్తున్నాం. కాలేజీలలో అవగాహన కల్పిస్తున్నామని హరీష్ కుమార్ గుప్తా చెప్పారు.
ఇది కూడా చదవండి: Champions Trophy: నేడే ప్రత్యర్ధితో పోరు..గత ఫైనల్ ప్రతీకారం భారత్ తీర్చుకుంటుందా..