AP GAS SYLINDERS: మహిళలకు బిగ్‌ అలర్ట్‌.. ఇలా చేయకపోతే ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ క్యాన్సిల్!

ఏపీ మహిళలకు బిగ్‌ అలర్ట్‌. ఇప్పటివరకు గ్యాస్‌ సిలిండర్‌ తీసుకోని వారు మార్చి ఆఖరికల్లా మొదటి సిలిండర్‌ను బుక్ చేసుకోవాలని పౌరసరఫరాలశాఖ సూచించింది. లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని అధికారులు తెలిపారు. 

New Update
free gas cylinder scheme

AP government key announcement on free gas booking

AP GAS SYLINDERS: సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఒకటైన దీపం-2 పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారులను అలర్ట్‌ చేసింది. ఇప్పటివరకు గ్యాస్‌ సిలిండర్‌ తీసుకోని వారు.. మార్చి ఆఖరికల్లా మొదటి సిలిండర్‌ను బుక్ చేసుకోవాలని సూచించింది. లేదంటే మూడు సిలిండర్లలో ఒకటి కోల్పోతారని పౌరసరఫరాల అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు గ్యాస్‌ బుక్‌ చేసుకోనివారికి ఇదే లాస్ట్‌ ఛాన్స్‌ అని హెచ్చరించారు. 

రేషన్‌కార్డే ప్రామాణికం..

2024 అక్టోబర్‌ 31 నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీని ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం. రేషన్‌కార్డే ప్రామాణికంగా దీపం- 2 పథకాన్ని అమలు చేస్తోంది. ఇందుకు అక్టోబరు 29 నుంచే ఉచిత గ్యాస్‌ సిలిండర్లు బుక్‌ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ పథకం కింద ఇప్పటివరకు 97 లక్షల మంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్‌ సిలిండర్ లభించింది. ఇక ఏప్రిల్‌ నుంచి రెండో సిలిండర్‌ బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరిట కనెక్షన్‌ ఉందో వారి పేరు కచ్చితంగా రేషన్‌ కార్డులో ఉంటేనే రాయితీ వర్తిస్తుంది. 

Also read :  ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

ఈకేవైసీ తప్పనిసరి.. 

ఇక ఉచిత సిలిండర్‌ కోసం గ్యాస్ ఏజెన్సీలో ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. అప్పుడే ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ రాయితీ పొందొచ్చు. ఈకేవైసీ చేసుకోకపోయినా, ప్రతినెలా రేషన్‌ తీసుకోకపోయినా, 300 యూనిట్లకుపైగా విద్యుత్తు వినియోగం, ప్రభుత్వ ఉద్యోగులు, కారు ఉన్నా ఈ దీపం పథకం వర్తించదు. దీపం-2 లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో లేదా డీలర్‌ దగ్గరకు వెళ్లి గ్యాస్‌ బుక్‌ చేసుకోవచ్చు. లబ్ధిదారులు అధికారుల సూచనలను దృష్టిలో ఉంచుకుని వెంటనే గ్యాస్‌ సిలిండర్‌ను బుక్‌ చేసుకోని ఫ్రీ గ్యాస్ ను మిస్ చేసుకోవద్దని సూచించారు. 

Also read : ఇది కదా హారర్ అంటే.. పట్టపగలే వణుకు పుట్టించే థ్రిల్లర్..

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Lady Aghori: శ్రీవర్షిణి కనిపిస్తే.. జైల్లో అఘోరీ గుండెపగిలేలా ఏడుస్తూ..!

43రోజులుగా చంచల్‌గూడ జైలులోనే ఉన్న అఘోరీని RTV బృందం కలిసింది. అక్కడ అఘోరీ శ్రీవర్షిణి కోసం కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె బాగోగులు అడిగి తెలుసుకుంది. శ్రీవర్షిణి కనిపిస్తే అడిగానని చెప్పాలని తెలిపింది. బెయిల్ ఇప్పించే స్తోమత తన తల్లిదండ్రులకు లేదని ఏడ్చింది.

New Update
lady aghori and srivarshini

lady aghori and srivarshini

గత ఏడాది నుంచి లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సనాతన ధర్మం అంటూ.. మహిళలపై జరుగుతున్న అఘోయిత్యాల కోసం తాను పోరాడుతానని ఏపీ, తెలంగాణలో తెగ తిరిగేశాడు. ఆ సమయంలో పలువురితో గొడవలకు దిగాడు. అక్కడితో ఆగకుండా పోలీస్ అధికారులపై సైతం దాడులు చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. 

ఇది కూడా చూడండి: Kannada row: తమిళ్ నుంచే తెలుగు పుట్టింది.. డీఎంకే నేత సంచలన ఆరోపణలు

ఇక ఎప్పుడైతే వర్షిణీతో ప్రేమలో పడ్డాడో అప్పటి నుంచి అఘోరీ జీవితం పూర్తిగా మారిపోయింది. వర్షిణీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలోనే మరో మహిళ అతడిపై కేసు వేసింది. తానే మొదటి భార్యనని రాధిక అనే మహిళ మీడియా ముందుకు రావడం సంచలనం రేపింది. అది మాత్రమే కాకుండా ఓ సినిమా ప్రొడ్యూసర్ సైతం అఘోరీపై కేసు వేసింది. 

ఇది కూడా చూడండి: Bengaluru Stampede : ఏం మనుషులురా మీరు... తొక్కిసలాటలోనూ లైంగిక వేధింపులు

43 రోజులుగా జైలులోనే

పూజలు పేరుతో తనను బెదిరించి రూ.10 లక్షలు తీసుకున్నాడని కేసు వేయడంతో పోలీసులు అఘోరీని అరెస్టు చేశారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైల్లోనే ఉంచారు. ఇటీవలే మోకిలా, కొమురవెళ్లి కేసుల్లో అఘోరీకి బెయిల్‌ వచ్చింది. కానీ తన మొదటి భార్య రాధిక పెట్టిన కేసులో ఇంకా బెయిల్ రాలేదు. దీంతో జైల్లోనే ఉంచారు. ఇలా అఘోరీ దాదాపు 43 రోజులుగా చంచల్‌గూడ జైలులోనే ఉంది. తాజాగా చంచల్‌గూడ జైల్లో ఉన్న అఘోరీ అలియాస్‌ శ్రీనివాస్‌ను RTV బృందం కలిసింది. 

ఇది కూడా చూడండి: Curd: ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పెరుగు తినండి.. మీకు ఈ ప్రయోజనాలన్నీ లభిస్తాయి!

శ్రీ వర్షిణి కనిపిస్తే

అక్కడ అఘోరీ శ్రీ వర్షిణి కోసం కన్నీళ్లు పెట్టుకుంది. అంతేకాకుండా శ్రీవర్షిణి బాగోగులు అడిగి తెలుసుకుంది. శ్రీ వర్షిణి కనిపిస్తే అడిగానని చెప్పాలని తెలిపింది. బెయిల్ ఇప్పించే స్తోమత తన తల్లిదండ్రులకు లేదు అని అఘోరీ కన్నీళ్లు పెట్టుకుంది. తన అమ్మానాన్నలకు తాను ఏం చేయలేకపోయాను అని ఆవేదన చెందింది. శివయ్య, కాళీమాతను నమ్ముకున్నానని.. అంతా ఆ పైవాడికే వదిలేస్తున్నానని తెలిపింది. ఒకవేళ తనకు బెయిల్ ఇప్పించాలంటే తన  తల్లిదండ్రుల జీవనాధారమైన ఆవులను అమ్ముకోవాలి అని పేర్కొంది. అందుకే తాను వాళ్లను ఇబ్బంది పెట్టడం లేదని తెలిపింది. సనాతన ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధం అని చెప్పింది. 

Advertisment
Advertisment